దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభకోణం కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్.. చేసిన పని విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్.. ప్రజల నుంచి 792 కోట్ల రూపాయలను వసూలు చేసి.. బోర్డు తిప్పేశాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తుల విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ఈడీ అధికారులు ముందుకు వేయలేక పోయారు. తాజాగా ఓ బుల్లి విమానాన్ని మాత్రమే విక్రయించి.. 3 కోట్ల రూపాయలను పొందారు.
ఈ సొమ్మునే బాధితులకు పంచనున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముంబైలో వేల కోట్లరూపాయలు విలువ చేసే సొమ్ములు ఉండగా.. వాటి విషయంలో చర్యలు తీసుకోని ఈడీ.. హైదరాబాద్లోని శంషాబాద్లో పార్కింగ్ చేసిన బుల్లి విమానాన్ని విక్రయించి 3 కోట్ల రూపాయలను పొందడం, ఈ సొమ్మునే బాధితుల ఖాతాల్ల లోకి జమ చేస్తామని చెప్పడం వంటివాటిపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఈ సొమ్మును ఎవరికి ఏమేరకు పంచుతారని.. తాము చేసిన ఖర్చులో పది పైసల వంతు కూడా లేదని బాధితులు చెబుతున్నారు.
అమర్దీప్ కుమార్ పోంజీ పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి ప్రజల నుంచి సొమ్ములు సేకరించారు. ఆ తర్వాత.. బోర్డు తిప్పేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదైంది. అయితే.. అప్పటికే వసూలు చేసిన 792 కోట్ల సొమ్మును విదేశాలు దాటించారన్నా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ వాటిపై విచారణ చేస్తోంది. ఇప్పటికేపలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో స్థిరాస్తుల విషయం కోర్టులో ఉండడంతో చర్యలు చేపట్టలేక పోయింది. ఈ క్రమంలోనే చరాస్తిగా ఉన్న అమర్దీప్ కుమార్ సొంత విమానాన్ని స్వాధీనం చేసుకుంది.
ఈ విమానాన్ని రెండు రోజుల కిందట ఆన్లైన్లో వేలం పెట్టగా.. దేశానికే చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త రూ.3 కోట్లకు దక్కించుకున్నారు. ఈ సొమ్ము ఈడీ ఖాతాకు జమైనట్టు అధికారులు తెలిపారు. దీనిని బాధితులకు తలా కొంచెం పంచుతామని చెప్పడం గమనార్హం. కానీ, కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్న నేపథ్యంలో ఈ 3 కోట్లను ఎవరికి ఎంత పంచుతారన్నది ప్రశ్నగా మారింది. సాధారణ ప్రజలు దాచుకున్న సొమ్ముపై హుటాహుటిన దాడులు చేసే ఈడీ అధికారులు.. ఈ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా తెరమీదికి రావడం గమనార్హం.
This post was last modified on July 3, 2026 11:06 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…