Trends

790 కోట్ల మోసం… 3 కోట్లు రాబ‌ట్టిన ఈడీ!

దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభ‌కోణం కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌.. చేసిన ప‌ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు అమ‌ర్‌దీప్ కుమార్‌.. ప్ర‌జ‌ల నుంచి 792 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి.. బోర్డు తిప్పేశాడు. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయ‌న ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ఈడీ అధికారులు ముందుకు వేయ‌లేక పోయారు. తాజాగా ఓ బుల్లి విమానాన్ని మాత్ర‌మే విక్ర‌యించి.. 3 కోట్ల రూపాయ‌ల‌ను పొందారు.

ఈ సొమ్మునే బాధితుల‌కు పంచ‌నున్న‌ట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ముంబైలో వేల కోట్ల‌రూపాయ‌లు విలువ చేసే సొమ్ములు ఉండ‌గా.. వాటి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోని ఈడీ.. హైద‌రాబాద్‌లోని శంషాబాద్‌లో పార్కింగ్ చేసిన బుల్లి విమానాన్ని విక్ర‌యించి 3 కోట్ల రూపాయ‌ల‌ను పొంద‌డం, ఈ సొమ్మునే బాధితుల ఖాతాల్ల లోకి జ‌మ చేస్తామ‌ని చెప్ప‌డం వంటివాటిపై పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ఈ సొమ్మును ఎవ‌రికి ఏమేర‌కు పంచుతార‌ని.. తాము చేసిన ఖ‌ర్చులో ప‌ది పైస‌ల వంతు కూడా లేద‌ని బాధితులు చెబుతున్నారు.

అమ‌ర్‌దీప్ కుమార్ పోంజీ పేరుతో అధిక వ‌డ్డీలు ఆశ చూపి ప్ర‌జ‌ల నుంచి సొమ్ములు సేక‌రించారు. ఆ త‌ర్వాత‌.. బోర్డు తిప్పేశారు. దీనిపై ఫిర్యాదులు అంద‌డంతో కేసు న‌మోదైంది. అయితే.. అప్ప‌టికే వ‌సూలు చేసిన 792 కోట్ల సొమ్మును విదేశాలు దాటించార‌న్నా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన ఈడీ వాటిపై విచార‌ణ చేస్తోంది. ఇప్ప‌టికేప‌లు ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంది. వీటిలో స్థిరాస్తుల విష‌యం కోర్టులో ఉండ‌డంతో చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేక పోయింది. ఈ క్ర‌మంలోనే చ‌రాస్తిగా ఉన్న అమ‌ర్‌దీప్ కుమార్ సొంత విమానాన్ని స్వాధీనం చేసుకుంది.

ఈ విమానాన్ని రెండు రోజుల కింద‌ట ఆన్‌లైన్‌లో వేలం పెట్ట‌గా.. దేశానికే చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపార వేత్త రూ.3 కోట్ల‌కు ద‌క్కించుకున్నారు. ఈ సొమ్ము ఈడీ ఖాతాకు జ‌మైన‌ట్టు అధికారులు తెలిపారు. దీనిని బాధితుల‌కు త‌లా కొంచెం పంచుతామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. కానీ, కోట్ల రూపాయ‌ల్లో బ‌కాయిలు ఉన్న నేప‌థ్యంలో ఈ 3 కోట్ల‌ను ఎవ‌రికి ఎంత పంచుతార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. సాధార‌ణ ప్ర‌జ‌లు దాచుకున్న సొమ్ముపై హుటాహుటిన దాడులు చేసే ఈడీ అధికారులు.. ఈ విష‌యంలో ఎందుకు తాత్సారం చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 3, 2026 11:06 pm

Share

Recent Posts

తెలంగాణపై బీజేపీ ఆశలు వదులుకుందా?

ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ…

47 minutes ago

పాట రాకుండానే ‘ప్యారడైజ్’ ట్రెండింగ్

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది కానీ ప్యారడైజ్ మీద క్షేత్ర స్థాయిలో ఎంత బజ్…

56 minutes ago

అనిరుధ్, కావ్య మార‌న్ పెళ్లి డేట్ వ‌చ్చేసిందా?

గ‌త కొన్ని నెల‌లుగా త‌మిళ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ ర‌విచంద‌ర్ పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.…

2 hours ago

ఉరిశిక్షలు విధించడంలో ఈ జడ్జి ఆల్ టైం రికార్డ్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష చిత్రం ‘ఉరిశిక్ష’పై ఎంత పెద్ద డిబేట్ కు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.…

2 hours ago

మంత్రి తప్పుకి అసెంబ్లీలో సారీ చెప్పిన సీఎం

చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా…

4 hours ago

బ్రేకప్ వివాదంపై స్పందించిన ధృవ్ విక్రమ్?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ సినీ న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంది. త‌న పాస్ట్ ల‌వ్ స్టోరీ…

4 hours ago