కొత్తగా యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని అనుకునేవారికి ఇది చేదు వార్తే. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్ బుక్, ఐప్యాడ్ మోడళ్ల ధరలను ఏకంగా 20 నుంచి 42 శాతం వరకు పెంచేసింది. ఇండియాలో కూడా ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు M5 ప్రో చిప్ తో వచ్చే 14 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో లాంచ్ ప్రైస్ దాదాపు రెండున్నర లక్షలు ఉండగా, ఇప్పుడు అది ఏకంగా మూడు లక్షలకు చేరింది. ఇక ఐప్యాడ్ ఎయిర్ బేస్ మోడల్ ధర కూడా 84 వేల నుంచి లక్షా ఇరవై వేలకు పెరిగిపోయింది.
అసలు రేట్లు ఇంత దారుణంగా ఎందుకు పెరిగాయంటే, దీని వెనుక కృత్రిమ మేధ డేటా సెంటర్ల హవా ఉంది. ఈ ఏఐ డేటా సెంటర్ల కోసం మెమరీ, స్టోరేజ్ చిప్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనివల్ల సెమీకండక్టర్ల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు ఈ భారాన్ని కస్టమర్ల మీద పడకుండా తామే భరించామని, కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వస్తోందని యాపిల్ యాజమాన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం యూజర్లకు నిరాశ కలిగిస్తుందని తెలుసని, అయినా వేరే దారి లేదని కంపెనీ చెప్పుకొచ్చింది.
ధరల పెంపు ప్రకటన రాగానే మార్కెట్లో యాపిల్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏప్రిల్ తర్వాత ఎన్నడూ లేని విధంగా షేర్ వాల్యూ దాదాపు ఆరు శాతం మేర పడిపోయింది. నిజానికి మెమరీ చిప్ల కొరత తీవ్రంగా ఉండబోతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గతంలోనే హెచ్చరించారు. ఈ చిప్ షార్టేజ్ వల్ల ఇప్పటికే కొన్ని మ్యాక్ మోడళ్ల తయారీ, డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా లేవని, రాబోయే కొన్ని నెలల పాటు ఈ కొరత ఇలాగే కొనసాగుతుందని అన్నారు.
ప్రస్తుతానికి ఐఫోన్, ఆపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ భవిష్యత్తులో వాటి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబర్ లో రాబోయే ఐఫోన్ 18 సిరీస్ లో ప్రో మోడళ్ల ధరలు భారీగా ఉండొచ్చని తెలుస్తోంది. కెమెరా విడిభాగాల ఖర్చు పెరగడం వల్ల ప్రో మోడళ్లపై కనీసం వంద డాలర్ల భారం పడే ఛాన్స్ ఉంది. ఇక నుంచి ఆపిల్ ప్రొడక్ట్స్ వాడే సామాన్య వినియోగదారుల జేబులకు మాత్రం ఈ నిర్ణయం వల్ల పెద్ద చిల్లు పెట్టినట్లే.
మొన్న విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ ధర్మన్ ఫస్ట్ లుక్ మీద నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. ఏఐ వాడారని,…
టాలీవుడ్ లో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, అయితే వరల్డ్ బిల్డింగ్ లేదా ప్యాన్ ఇండియా. వీటి పేరుతో ఎలివేషన్లు ఉన్న…
ఏపీలో చేరికల పర్వం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందుగానే వైసీపీని ఖాళీ చేసే దిశగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆపరేషన్…
మీరు భారతీయులేనా?- ఈ సందేహం ఎందుకు? అనే డౌటు రావొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో ఇది…
మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం…
జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…