టాలీవుడ్ లో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, అయితే వరల్డ్ బిల్డింగ్ లేదా ప్యాన్ ఇండియా. వీటి పేరుతో ఎలివేషన్లు ఉన్న కథలు రాస్తున్నారు. అడవి, దశాబ్దాల వెనుక ప్రపంచం, వింత శక్తులు ఉన్న పల్లెటూరు, గ్యాంగ్ స్టర్ మాఫియా, నేర సామ్రాజ్యం ఇలా ఒక పది రకాల కాన్సెప్టుల చుట్టే దర్శకులు చక్కర్లు కొడుతున్నారు. నిర్మాతలు కూడా ఇవే కావాలంటూ కోట్లకు కోట్లు ధారపోస్తున్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్లే రిలీజ్ ఆగిపోయిన పెద్ద సినిమాలు అయిదారు దాకా ఉన్నాయి.
అసలు జానర్ ని మన రచయితలు నిర్లక్ష్యం చేయడం ముమ్మాటికి తప్పే. తాజాగా వచ్చిన మా ఇంటి బంగారం మంచి ఉదాహరణగా నిలుస్తోంది. బడ్జెట్ హద్దులు మీరలేదు. పదుల కొద్దీ లొకేషన్లు, గ్రీన్ మ్యాట్లు, విఎఫ్ఎక్స్, విదేశీ ప్రయాణాలు ఇవేవి లేకుండా సింపుల్ గా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడిన ఒక క్లీన్ స్టోరీ రాశారు రాజ్ నిడిమోరు. దానికి తన అనుభవం ఉపయోగించిన దర్శకురాలు నందిని రెడ్డి మంచి అవుట్ ఫుట్ ఇచ్చి సమంత ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ వేశారు.
ఈ వాస్తవాన్ని చరిత్ర చాలా సార్లు చెప్పింది. మూస చిత్రాలు రాజ్యమేలుతున్న టైంలో నాగార్జున నిన్నే పెళ్లాడతా రికార్డులు బద్దలు కొట్టింది. వెంకటేష్ కలిసుందాం రా సాధించిన మైలురాళ్ళు గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. జూనియర్ ఎన్టీఆర్ బృందావనం, మహేష్ వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మొదలైన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ అతిగా ఉండవు. మితంగా ఉంటూనే క్లాసు మాస్ ఆడియన్స్ ని బ్రహ్మాండంగా మెప్పించాయి.
మళ్ళీ అలాంటి ట్రెండ్ ఊపిరి పోసుకోవాలి. అప్పుడే సినిమాలు వేగంగా పూర్తవుతాయి. జెన్ జీ పేరుతో సింపుల్ గా తప్పించుకుంటే కుదరదు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మా ఇంటి బంగారం మహిళలకు స్పెషల్ షో వేస్తే స్క్రీన్ దగ్గర డాన్స్ చేసింది పాతికేళ్ల లోపు యువతులే. సో కాన్సెప్ట్ బాగుండాలే కానీ అన్నీ కెజిఎఫ్ పుష్పలే కావాలని జనాలు కోరుకోవడం లేదు. కుటుంబ కథా చిత్రాలు అనే ట్యాగ్ లో ఎంత బలముందో హిస్టరీ బుక్స్ ని మరోసారి తిరగేసి మన రైటర్లు ఆ దిశగా ఆలోచించడం అవసరం.
ఏపీలో చేరికల పర్వం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందుగానే వైసీపీని ఖాళీ చేసే దిశగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆపరేషన్…
మీరు భారతీయులేనా?- ఈ సందేహం ఎందుకు? అనే డౌటు రావొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో ఇది…
మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం…
జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…