మొన్న విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ ధర్మన్ ఫస్ట్ లుక్ మీద నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. ఏఐ వాడారని, ఏ మాత్రం సానుకూల అభిప్రాయం కలిగే అవకాశం లేకుండా నిర్లక్ష్యంగా పోస్టర్ డిజైన్ చేశారని అభిమానులు విరుచుకుపడ్డారు. విడుదల చేసే ముందు కనీసం ఒకసారి చెక్ చేసుకోలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. కమల్ హాసన్ నిర్మాతగా అశ్వత్ మరిముత్తు దర్శకుడిగా ఉన్న ఇలాంటి ప్రాజెక్టుకి ఈ స్పందన ఊహించనిది.
దెబ్బకు డ్యామేజ్ జరిగిందని గుర్తించిన నిర్మాణ సమస్త రాజ్ కమల్ ఇంటర్నేషనల్ వెంటనే దిద్దుబాటుకు పూనుకుంది. నిన్న చాలా బెటర్ గా అనిపించే కొత్త లుక్కు వదిలింది. అంతే కాదు మేకింగ్ అఫ్ ధర్మన్ అంటూ రజని మేకప్ వేసుకున్నట్టుగా ఉన్న విజువల్స్ పొందుపరిచి మమ అనిపించింది. నిజానికి అందులో మేకప్ కు సంబంధించి సరైన స్పష్టత లేదు. ధర్మన్ టైటిల్ మీద కూడా మిశ్రమ స్పందన ఉంది. పాత చింతకాయ పచ్చడి టైపులో పెట్టారనే కామెంట్స్ ఉన్నాయి.
రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టారర్ కన్నా ముందు వచ్చే మూవీ కావడంతో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. కేవలం రెండు సినిమాల అనుభవమున్న అశ్వత్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనే అనుమానం చెన్నై వర్గాల్లో లేకపోలేదు. డ్రాగన్ లాంటి న్యూ ఏజ్ స్టోరీతో మెప్పించడం వేరు,. రజని లాంటి మాస్ ఐకాన్ ని ప్రెజెంట్ చేయడం వేరు. కార్తీక్ సుబ్బరాజ్, శిరుతై శివ, పా రంజిత్ లాంటి వాళ్ళు ఈ పల్స్ ని పూర్తిగా పట్టుకోలేక బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేకపోయారు.
ధర్మన్ కన్నా ముందు విడుదల కావాల్సిన సినిమా జైలర్ 2. చాలా కాలంగా అప్డేట్స్ ఇవ్వడం మానేశారు. బాలయ్య, షారుఖ్ ఖాన్ ఇందులో క్యామియోకి నో చెప్పాక ఫైనల్ గా హృతిక్ రోషన్ రంగంలోకి దిగాడు. ఈ ఎపిసోడ్ షూట్ ఆల్రెడీ మొదలైపోయింది. అన్నట్టు ధర్మన్ కి తెలుగులో ఏ పేరు పెడతారనేది ఇంకా నిర్ణయించలేదట. తెలుగు వెర్షన్ హక్కులు కమల్ గత సినిమాలు పంపిణి చేసిన నితిన్ ఫ్యామిలీకే దక్కవచ్చని టాక్. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఫైనల్ కాకపోవచ్చు.
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం…
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య…
రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ…