అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పొరుగున ఉన్న వెనుజులా బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సంభవించిన భూకంపాలతో ఒక్కసారిగా చివురుటాకులా వణికి పోయింది. భారీ భూకంపం ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రపంచంలోనే తొలిసారి ఇంత పెద్ద భూకంపం సంభవించినట్టు అమెరికా భూగర్భ శాస్ట్ర విభాగం పేర్కొంది. ఈ ప్రమాదంలో వేల మంది పౌరులు మృతి చెంది ఉంటారని తెలిపింది. భవనాల శిధిలాల కింద శవాలగుట్టలు పేరుకుపోయిన ఫొటోలను ఈ విభాగం పోస్టు చేసింది.
అత్యవసర పరిస్థితి
కనీ వినీ ఎరుగని భూకంపం కారణంగా వేల మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నా.. వెనుజులా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన తీరును చూస్తే.. భారీగానే ప్రాణనష్టం సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం రెండు సార్లు మాత్రమే భూమి కంపించినా.. దాని ప్రకంనలు మాత్రం 20 సార్లు ప్రభావం చూపించాయని వెనుజులా పేర్కొంది. ముఖ్యంగా అత్యంత జనసమర్థంగా ఉండే మెక్వేషియా ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. బుధవారం దేశంలో సెలవు దినం కావడంతో ఎక్కువ మంది ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు కార్యాలయాలు, బ్యాంకులకు కూడా సెలవు కావడంతో ఈ ప్రమాదం తీవ్రత ప్రజలపైనే ఎక్కువగా ఉందని అంటున్నారు. అందుకే.. ప్రాణనష్టం కూడా ఎక్కువగా జరిగిందన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం వచ్చిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా..
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విమానాశ్రయాలను మూసి వేశారు. వెనుజులాకు వచ్చే విమానాలను వెనక్కి పంపేశారు. ప్రజలు తమ ప్రయాణాలను మానుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్యానిక్ వార్తలను నమ్మరాదని ప్రభుత్వం సూచించింది.
క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027…
మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ…
తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన…
వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్…
లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో ఘనంగా జరిగింది. దశాబ్దంకు పైగా ఎదురు చూసిన విజయం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మొదట 80వ…