నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధంగా పేపర్ లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
పరీక్షకు ముందు రోజు 100కు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తోంది.
మహారాష్ట్రలోని నాసిక్ లో మొదలైన ఈ లీక్ వ్యవహారం మొత్తం 5 రాష్ట్రాలకు పాకిందని తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ కాపీని హరియాణాకు పంపి అక్కడ సెట్ కు 10 కాపీల చొప్పున 5 వేర్వేరు సెట్లను ప్రింట్ చేశారట.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ లకు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఓ హాస్టల్లోని ‘గెస్ పేపర్’ పై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గెస్ పేపర్ లోని 410 ప్రశ్నల్లో 120 పరీక్షలో రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక, పరీక్షకు 2 రోజుల ముందు క్వశ్చన్ పేపర్ ను నీట్ గా అభ్యర్థులకు అమ్మారట. ఒక్కో పేపర్ 5 లక్షలకు బేరం పెట్టారని, పరీక్ష రోజు దాని రేటు 30 వేలకు తగ్గించారని తెలుస్తోంది. నాసిక్ లో పేపర్ లీక్ చేసిన నిందితుడిని రాజస్థాన్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో 5 రాష్ట్రాలకు చెందిన 9 మంది అరెస్టయ్యారు.
This post was last modified on May 12, 2026 5:57 pm
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…