Trends

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధంగా పేపర్ లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

పరీక్షకు ముందు రోజు 100కు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తోంది.

మహారాష్ట్రలోని నాసిక్ లో మొదలైన ఈ లీక్ వ్యవహారం మొత్తం 5 రాష్ట్రాలకు పాకిందని తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ కాపీని హరియాణాకు పంపి అక్కడ సెట్ కు 10 కాపీల చొప్పున 5 వేర్వేరు సెట్లను ప్రింట్ చేశారట.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ లకు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఓ హాస్టల్లోని ‘గెస్ పేపర్’ పై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గెస్ పేపర్ లోని 410 ప్రశ్నల్లో 120 పరీక్షలో రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇక, పరీక్షకు 2 రోజుల ముందు క్వశ్చన్ పేపర్ ను నీట్ గా అభ్యర్థులకు అమ్మారట. ఒక్కో పేపర్ 5 లక్షలకు బేరం పెట్టారని, పరీక్ష రోజు దాని రేటు 30 వేలకు తగ్గించారని తెలుస్తోంది. నాసిక్ లో పేపర్ లీక్ చేసిన నిందితుడిని రాజస్థాన్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో 5 రాష్ట్రాలకు చెందిన 9 మంది అరెస్టయ్యారు.

Kumar

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

7 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

8 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

9 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

9 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

10 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

10 hours ago