కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు నమోదైన నాలుగు రోజుల తర్వాత భగీరథ్ కేసుపై విచారణ జరపాలంటూ సిట్ వేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక, భగీరథ్ పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పడంపై కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉండడం, పోలీసులకు దొరకకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును భగీరథ్ ఆశ్రయించారు.
భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 14న వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఈ కేసును సీనయిర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించబోతుండడం విశేషం. గతంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరోవైపు, బాధితురాలి తల్లిదండ్రులను బండి సంజయ్ బెదిరించారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన బాధిత బాలిక తల్లిదండ్రులను ఈ కేసు సెటిల్ చేసుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. బాధితులు బండి సంజయ్ ను కలిసిన రోజు కాల్ డేటా రికార్డింగ్, సీసీటీవీ ఫుటేజిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…