కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు నమోదైన నాలుగు రోజుల తర్వాత భగీరథ్ కేసుపై విచారణ జరపాలంటూ సిట్ వేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక, భగీరథ్ పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పడంపై కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉండడం, పోలీసులకు దొరకకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును భగీరథ్ ఆశ్రయించారు.
భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 14న వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఈ కేసును సీనయిర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించబోతుండడం విశేషం. గతంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరోవైపు, బాధితురాలి తల్లిదండ్రులను బండి సంజయ్ బెదిరించారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన బాధిత బాలిక తల్లిదండ్రులను ఈ కేసు సెటిల్ చేసుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. బాధితులు బండి సంజయ్ ను కలిసిన రోజు కాల్ డేటా రికార్డింగ్, సీసీటీవీ ఫుటేజిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
This post was last modified on May 12, 2026 4:48 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…