కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు నమోదైన నాలుగు రోజుల తర్వాత భగీరథ్ కేసుపై విచారణ జరపాలంటూ సిట్ వేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక, భగీరథ్ పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పడంపై కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉండడం, పోలీసులకు దొరకకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును భగీరథ్ ఆశ్రయించారు.
భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 14న వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఈ కేసును సీనయిర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించబోతుండడం విశేషం. గతంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరోవైపు, బాధితురాలి తల్లిదండ్రులను బండి సంజయ్ బెదిరించారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన బాధిత బాలిక తల్లిదండ్రులను ఈ కేసు సెటిల్ చేసుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. బాధితులు బండి సంజయ్ ను కలిసిన రోజు కాల్ డేటా రికార్డింగ్, సీసీటీవీ ఫుటేజిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
This post was last modified on May 12, 2026 4:48 pm
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…