కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు నమోదైన నాలుగు రోజుల తర్వాత భగీరథ్ కేసుపై విచారణ జరపాలంటూ సిట్ వేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక, భగీరథ్ పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పడంపై కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉండడం, పోలీసులకు దొరకకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును భగీరథ్ ఆశ్రయించారు.
భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 14న వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఈ కేసును సీనయిర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించబోతుండడం విశేషం. గతంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరోవైపు, బాధితురాలి తల్లిదండ్రులను బండి సంజయ్ బెదిరించారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన బాధిత బాలిక తల్లిదండ్రులను ఈ కేసు సెటిల్ చేసుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. బాధితులు బండి సంజయ్ ను కలిసిన రోజు కాల్ డేటా రికార్డింగ్, సీసీటీవీ ఫుటేజిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…