Movie News

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తమ అభ్యర్థనలు పంచుకున్న థియేటర్ ఓనర్లు కం ఎగ్జిబిటర్లు తమకు అద్దెలు వద్దని చెబుతూ మల్టీప్లెక్సులకు అమలు చేస్తున్న తరహాలో తమకూ వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇది కనక పరిష్కారం కాకపోతే ఈ నెలాఖరు నుంచి సింగల్ స్క్రీన్ల బందుకు పిలుపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వినికిడి.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎగ్జిబీటర్లు సైతం ఇదే డిమాండ్ తో త్వరలో సమావేశం కాబోతున్నారు. వస్తున్న ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని, కాబట్టి స్థిరమైన పర్సెంటేజ్ విధానాన్ని తీసుకురావాలని వాళ్ళూ కోరుతున్నారు. అంటే అటు ఇటు తిరిగి ఇది పెద్ది టైంకంతా పెద్ద రచ్చగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో హరిహర వీరమల్లు టైంలో ఏం జరిగిందో అందరికి తెలిసిందే. సమస్యని తాత్కాలికంగా ఆపగలిగారు కానీ పరిష్కారం కాలేదు.

టాలీవుడ్ ఈ విషయంలో రెండుగా విడిపోయిందనేది ఓపెన్ సీక్రెట్. అగ్ర నిర్మాతలు కొందరు ఈ విధానం పట్ల ఏ మాత్రం సానుకూలంగా లేరు. దాని ప్రభావం ఇటీవలే సత్య నడిచిన జెట్లీ మీద గట్టిగా పడింది. హైదరాబాద్ లో తక్కువ షోలు పడ్డాయి. సరే అదంటే చిన్న సినిమా కాబట్టి ఎవరికి ఇబ్బంది అనిపించలేదు. కానీ పెద్ది అలా కాదు. సంక్రాంతి తర్వాత వస్తున్న అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీ. జనాలు ఆకలితో ఉన్న టైంలో రామ్ చరణ్ భారీ అంచనాలతో దిగుతున్నాడు.

సో వీలైనంత త్వరగా సయోధ్య కుదుర్చుకోవాలి. లేదంటే పెద్ది రిలీజప్పుడు లేనిపోని తలనెప్పి అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దిని సింగల్ స్క్రీన్స్ లో ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఒకవేళ పైన చెప్పిన ఇష్యూ సాల్వ్ కాకపోతే వాళ్ళు మల్టీప్లెక్సులకు వెళ్లేందుకు ఇష్టపడరు. అయినా పెద్దిని వదులుకోవడానికి, వేసుకోకుండా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు కానీ త్వరగా పరిష్కారం అయితే అదే పది వేలు అంటోంది ఇండస్ట్రీ.

This post was last modified on May 12, 2026 6:00 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Peddi

Recent Posts

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

6 hours ago