ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే…ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ చేస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. వాహనం ఒకటే… అయితే దానికి ఎప్పుడు పడితే అప్పుడు నెంబర్ మారిపోతుంది.
ఇందుకోసం ఈ మాయగాడు ఏకంగా ఓ కొత్త టెక్నాలజీనే రూపొందించాడు. ఆ టెక్నాలజీతో పోలీసులను మాయ చేస్తూ… వాహనానికి పడిన ఛలాన్లు క్లియర్ చేయకుండా తిరుగుతున్నాడు. అయితే తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు కదా. ఇతడు కూడా అలాగే పట్టుబడిపోయాడు. ఇతగాడు రూపొందించిన ఆ టెక్నాలజీని చూసి ఖాకీకే నోరెళ్లబెట్టేశారట.
హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…ఓ ఖరీదైన కారుతో నగరంలో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తి… రహదారి నిబంధనలను నిత్యం అతిక్రమిస్తూ తిరుగుతున్నాడట. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన సమయాల్లో పోలీసులు ఆ వాహనానికి జరిమానా విధిస్తూ ఛలాన్లు జారీ చేస్తున్నారు. అయితే ఈ ఛలాన్లకు సంబంధించిన సొమ్మును చెల్లించకుండానే అతగాడు యథేచ్ఛగా తిరుగుతున్నాడట. అయితే డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అతగాడు శనివారం రాత్రి పట్టుబడ్డాడట.
ఈ సందర్భంగా అతడి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు… అందులోని నయా టెక్నాలజీని చూసి అవాక్కయ్యారట. ఆ టెక్నాలజీ ఏంటంటే… సదరు వాహనం నెంబరును ఎప్పటికప్పుడు మార్చేసేందుకు ఆ వ్యక్తి సదరు టెక్నాలజీని రూపొందించాడట. ఈ టెక్నాలజీని ఇప్పటికే పలుమార్లు వినియోగించిన సదరు వ్యక్తి తన కారుపై ఉన్న లెక్కలేనన్ని ఛలాన్ల జరిమానాను చెల్లించకుండానే తిరుగుతున్నాడు.
ఇందుకు అతగాడు కారు నెంబర్ ప్లేట్లను ఎప్పటికప్పుడు మార్చాడట. అతడు వినియోగించిన టెక్నాలజీలో ఓ బటన్ నొక్కితే కారు నెంబర్ ఇట్టే మారిపోతుందట. ఇలా పోలీసులు కనిపించినప్పుడల్లా తన కారు నెంబరును మార్చేసుకుని వారి నుంచి తప్పించుకుని అతగాడు తిరుగుతున్నాడట.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…