ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే…ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ చేస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. వాహనం ఒకటే… అయితే దానికి ఎప్పుడు పడితే అప్పుడు నెంబర్ మారిపోతుంది.
ఇందుకోసం ఈ మాయగాడు ఏకంగా ఓ కొత్త టెక్నాలజీనే రూపొందించాడు. ఆ టెక్నాలజీతో పోలీసులను మాయ చేస్తూ… వాహనానికి పడిన ఛలాన్లు క్లియర్ చేయకుండా తిరుగుతున్నాడు. అయితే తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు కదా. ఇతడు కూడా అలాగే పట్టుబడిపోయాడు. ఇతగాడు రూపొందించిన ఆ టెక్నాలజీని చూసి ఖాకీకే నోరెళ్లబెట్టేశారట.
హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…ఓ ఖరీదైన కారుతో నగరంలో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తి… రహదారి నిబంధనలను నిత్యం అతిక్రమిస్తూ తిరుగుతున్నాడట. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన సమయాల్లో పోలీసులు ఆ వాహనానికి జరిమానా విధిస్తూ ఛలాన్లు జారీ చేస్తున్నారు. అయితే ఈ ఛలాన్లకు సంబంధించిన సొమ్మును చెల్లించకుండానే అతగాడు యథేచ్ఛగా తిరుగుతున్నాడట. అయితే డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అతగాడు శనివారం రాత్రి పట్టుబడ్డాడట.
ఈ సందర్భంగా అతడి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు… అందులోని నయా టెక్నాలజీని చూసి అవాక్కయ్యారట. ఆ టెక్నాలజీ ఏంటంటే… సదరు వాహనం నెంబరును ఎప్పటికప్పుడు మార్చేసేందుకు ఆ వ్యక్తి సదరు టెక్నాలజీని రూపొందించాడట. ఈ టెక్నాలజీని ఇప్పటికే పలుమార్లు వినియోగించిన సదరు వ్యక్తి తన కారుపై ఉన్న లెక్కలేనన్ని ఛలాన్ల జరిమానాను చెల్లించకుండానే తిరుగుతున్నాడు.
ఇందుకు అతగాడు కారు నెంబర్ ప్లేట్లను ఎప్పటికప్పుడు మార్చాడట. అతడు వినియోగించిన టెక్నాలజీలో ఓ బటన్ నొక్కితే కారు నెంబర్ ఇట్టే మారిపోతుందట. ఇలా పోలీసులు కనిపించినప్పుడల్లా తన కారు నెంబరును మార్చేసుకుని వారి నుంచి తప్పించుకుని అతగాడు తిరుగుతున్నాడట.
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…