ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే…ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ చేస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. వాహనం ఒకటే… అయితే దానికి ఎప్పుడు పడితే అప్పుడు నెంబర్ మారిపోతుంది.
ఇందుకోసం ఈ మాయగాడు ఏకంగా ఓ కొత్త టెక్నాలజీనే రూపొందించాడు. ఆ టెక్నాలజీతో పోలీసులను మాయ చేస్తూ… వాహనానికి పడిన ఛలాన్లు క్లియర్ చేయకుండా తిరుగుతున్నాడు. అయితే తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు కదా. ఇతడు కూడా అలాగే పట్టుబడిపోయాడు. ఇతగాడు రూపొందించిన ఆ టెక్నాలజీని చూసి ఖాకీకే నోరెళ్లబెట్టేశారట.
హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…ఓ ఖరీదైన కారుతో నగరంలో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తి… రహదారి నిబంధనలను నిత్యం అతిక్రమిస్తూ తిరుగుతున్నాడట. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన సమయాల్లో పోలీసులు ఆ వాహనానికి జరిమానా విధిస్తూ ఛలాన్లు జారీ చేస్తున్నారు. అయితే ఈ ఛలాన్లకు సంబంధించిన సొమ్మును చెల్లించకుండానే అతగాడు యథేచ్ఛగా తిరుగుతున్నాడట. అయితే డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అతగాడు శనివారం రాత్రి పట్టుబడ్డాడట.
ఈ సందర్భంగా అతడి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు… అందులోని నయా టెక్నాలజీని చూసి అవాక్కయ్యారట. ఆ టెక్నాలజీ ఏంటంటే… సదరు వాహనం నెంబరును ఎప్పటికప్పుడు మార్చేసేందుకు ఆ వ్యక్తి సదరు టెక్నాలజీని రూపొందించాడట. ఈ టెక్నాలజీని ఇప్పటికే పలుమార్లు వినియోగించిన సదరు వ్యక్తి తన కారుపై ఉన్న లెక్కలేనన్ని ఛలాన్ల జరిమానాను చెల్లించకుండానే తిరుగుతున్నాడు.
ఇందుకు అతగాడు కారు నెంబర్ ప్లేట్లను ఎప్పటికప్పుడు మార్చాడట. అతడు వినియోగించిన టెక్నాలజీలో ఓ బటన్ నొక్కితే కారు నెంబర్ ఇట్టే మారిపోతుందట. ఇలా పోలీసులు కనిపించినప్పుడల్లా తన కారు నెంబరును మార్చేసుకుని వారి నుంచి తప్పించుకుని అతగాడు తిరుగుతున్నాడట.
This post was last modified on April 12, 2026 4:13 pm
టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ…
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…