బెంగళూరు తర్వాత హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే ఆంటీలు పెరుగుతున్నారు. అయితే.. ఇటా బాయ్ ఫ్రండ్స్ను కోరుకుంటున్న మహిళల వయసు.. 45-55 మధ్య ఉంటోందని వివాహేతర సంబంధాలతో ముడిపడిన `గ్లీడెన్` యాప్ పేర్కొంది.
గ్లీడెన్ అనేది వివాహేతర సంబంధాల కోసం కేటాయించిన యాప్. ఇది ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఇది ఏటా తన వివరాలను వెల్లడిస్తుంది. దీని ప్రకారం.. భారత దేశంలో వివాహేతర సంబంధాల ట్రెండ్ జోరుగా నడుస్తోందని వెల్లడించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాలు కోరుకుంటున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని కూడా స్పష్టం చేసింది.
ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ నగరాలు వరుసగా వివాహేతర సంబంధాలలో ముందున్నాయని వెల్లడించిన గ్లీడెన్.. గడిచిన రెండేళ్లలో 148 శాతం మహిళా సభ్యులు తమకు పెరిగినట్టు పేర్కొంది. తమ యాప్లోని 17 శాతం మంది హైదరాబాద్లో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. పని ఒత్తిడి.. కుటుంబ ఒత్తిళ్ల నుంచి `స్నేహితులతో విరామం` కోరుకునేవారు పెరుగుతున్నట్టు పేర్కొంది.
అయితే.. ఈ జాబితాలో పురుషులు కూడా ఉన్నారని తెలిపింది. కానీ.. పురుషులు మాత్రం తమ కన్నా చిన్నవయసు యువతులను పార్టనర్స్గా కోరుకుంటున్నట్టు ఈ యాప్ వెల్లడించింది. చిత్రం ఏంటంటే.. ఈ యాప్లో చేరాలంటే పురుషులు డబ్బులు కట్టాలి. మహిళలకు మాత్రం ఫ్రీ. దీంతో మహిళ సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…