భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఘోర పరాభవం పాలైంది టీమ్ ఇండియా. రెండో ఇన్నింగ్స్లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి అవమాన భారాన్ని మూటగట్టుకుంది. ఆ మ్యాచ్లో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్న స్థితిలో జట్టుకు మూల స్తంభం అయిన విరాట్ కోహ్లికి స్వదేశానికి వచ్చేస్తున్నాడు. అతను చివరి మూడు టెస్టులకూ అందుబాటులో ఉండడు. తన భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మనిస్తుండటంతో అతను స్వదేశానికి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒక ప్రతిష్టాత్మక సిరీస్లో జట్టు తొలి మ్యాచ్ ఓడి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండగా కోహ్లి ఇలా వచ్చేయడం కరెక్టా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కానీ తొలిసారి తండ్రి కావడంలో ఉన్న అనుభూతిని ఆస్వాదించడానికి కోహ్లి అలా వెళ్లిపోవడంలో తప్పేమీ లేదన్న వాదనా ఉంది. వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమే అన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
ఐతే ఒకప్పుడు మహేంద్రసింగ్ ధోని జట్టు కోసం తొలి బిడ్డ ప్రసవానికి దూరంగా ఉన్నాడు. బిడ్డ పుట్టిన కొన్ని వారాల తర్వాతే వెళ్లి చూశాడు. అలా కోహ్లి చేసి ఉండొచ్చు కదా అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. గతం సంగతి వదిలేస్తే ప్రస్తుతం భారత జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు జట్టు కోసం చేసిన త్యాగాలు ప్రస్తావనార్హం. మహ్మద్ సిరాజ్ తండ్రి గత నెలలో చనిపోయాడు. అతనప్పటికి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. స్వదేశానికి వచ్చి తండ్రిని చివరి చూపు చూసి వెళ్తే అతను మళ్లీ క్వారంటైన్లో ఉండాలి. ఇదంతా ఎందుకని అతను ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు.
ఇక తమిళనాడు ఫాస్ట్ బౌలర్ నటరాజన్ విషయానికి వస్తే.. అతడికి ఇటీవలే తొలి బిడ్డ పుట్టింది. అతను వాస్తవానికి యూఏఈలో ఐపీఎల్ ముగిశాక స్వదేశానికి వచ్చేయాల్సింది. కానీ నెట్ బౌలర్గా అతణ్ని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారు. తర్వాత అనుకోకుండా వన్డేలు, టీ20ల్లో ఆడే అవకాశం దక్కింది. టెస్టు జట్టులో నటరాజన్కు చోటు లేదు. అయినా సరే.. అతణ్ని స్వదేశానికి పంపించలేదు. టెస్టు సిరీస్కు నెట్ బౌలర్గా కొనసాగించారు. అతను జనవరి నెలాఖర్లో కానీ స్వదేశానికి రాడు. ఒక జూనియర్ ఆటగాడికి మాత్రం తొలి బిడ్డ ప్రసవం కీలకం కాదా.. అతణ్ని నెట్ బౌలర్గా అలాగే ఆస్ట్రేలియాలో ఉంచేస్తారా.. కానీ జట్టులో కీలక ఆటగాడైన కోహ్లి టీమ్ ఇండియా కష్టాల్లో ఉండగా వదిలేసి స్వదేశానికి వెళ్తానంటే బీసీీసీఐ ఎలా సరే అంది అంటూ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ఓ కాలమ్లో పరోక్షంగా ప్రశ్నలు సంధించాడు.
This post was last modified on December 24, 2020 3:56 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…