పాకిస్ధాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో నివసించే కరిమ బలూచి హత్య యావత్ ప్రపంచంలోని సోషల్ మీడియాతో పాటు మీడియాను కూడా ఓ ఊపు ఊపేస్తోంది. ఆమధ్య బలూచిస్ధాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటూ కరీమా ప్రధానమంత్రి నరేంద్రమోడికి బహిరంగంగా విజ్ఞప్తి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. బలూచిస్ధాన్ లోని పరిస్ధితులు ప్రధానంగా మహిళల పరిస్ధితి చాలా ఘోరంగా ఉందని చెబుతూ వెంటనే మోడిని జోక్యం చేసుకోవాలని కరీమా కోరింది. అప్పట్లో ఆ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఎందుకంటే పాకిస్ధాన్ లో బలూచిస్ధాన్ వ్యవహారాల్లో భారత్ ప్రధానిని జోక్యం చేసుకోవాలని కోరటమంటూ మామూలు విషయం కాదు. బలూచిస్ధాన్ లో ప్రతిరోజు మహిళలను అపహరించటం, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నట్లు ఆమె మొత్తకున్నారు. మహిళలకే కాదు చివరకు మగవాళ్ళకూ కూడా భద్రత లేదని ఆమె ఎంతగానో గోల చేశారు. దాంతో అంతర్జాతీయ మీడియా దృష్టంతా బలూచిస్ధాన్ పై పడింది.
ఎప్పుడైతే అంతర్జాతీయ మీడియా దృష్టితో పాటు విదేశీ ప్రభుత్వాల దృష్టి బలూచిస్ధాన్ పై పడిందని గ్రహించిందో వెంటనే పాకిస్ధాన్ ప్రభుత్వం అలర్టయ్యింది. దాంతో మానవహక్కుల కార్యకర్తలు కూడా ఇంకా యాక్టివ్ అయ్యారు. ఇటువంటి సమయంలో కరీమాపై దాడులు మొదలయ్యాయి. దాంతో బలూచిస్ధాన్ నుండి ఎలాగో తప్పించుకున్న కరీమా కెనాడకు పారిపోయింది. అక్కడి నుండే బలూచిస్ధాన్ లోని పరిస్ధితులపై పోరాటాలు ప్రారంభించింది.
సరే కరీమా ఎంతగా మొత్తుకున్నా నరేంద్రమోడి మాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే పాకిస్ధాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే వచ్చే తలనొప్పులేంటో బాగా తెలుసు. అందుకనే మోడి కూడా పట్టించుకోలేదు. అయితే కరీమా ఉద్దేశ్యం కూడా నేరుగా బలూచిస్ధాన్ అంతర్గత విషయాల్లో మోడి జోక్యం చేసుకోవాలని కాదు. అంతర్జాతీయ వేదికలపై బలూచిస్ధాన్ లో జరిగే పరిణామాలను మోడి ప్రస్తావిస్తారని అనుకున్నారు. ఇదే విషయాన్ని మోడికి విజ్ఞప్తి కూడా చేశారు.
అయితే ఏ విధంగా కూడా ప్రధానమంత్రి స్పందించలేదు. అయితే కెనాడుకు చేరుకున్న కరీమా మీద అక్కడ కూడా దాడులు మొదలయ్యాయి. ఎందుకంటే కరీమా కన్నా ముందే కెనాడాలో చాలామంది పాకిస్ధాన్ రిటైర్డ్ ఆర్మీ అధికారులున్నారు. వారికి పాకిస్ధాన్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఉద్యమకారిణిపై కెనాడాలో కూడా దాడులు మొదలైనట్లు ఆరోపణలున్నాయి. అంటే పాకిస్ధాన్ ఆర్మీలో రిటైర్డ్ అధికారులు, ఖలిస్ధాన్ తదితర సంస్ధల్లోని కీలక సభ్యుల ఆదేశాల ప్రకారమే కరీమాను చంపేసినట్లు ఆరోపణలున్నాయి. టోరంటోలోని లేక్ షోర్ సమీపంలో చనిపోయున్న కరీమాను గమనించి పోలీసులకు ఎవరో సమాచారమిచ్చారు. దాంతో విషయం బయటకువచ్చింది.
This post was last modified on December 23, 2020 4:32 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…