Trends

లక్షన్నర ఫ్లైట్ టికెట్ ఇప్పుడు 9 లక్షలు ఎందుకుంది?

ఎవడో యుద్దం చేసుకోవటం.. మరెవరో దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించాల్సి రావటం. నిజానికి యుద్దంతో ఇదే తంటా. మనకు ఏ మాత్రం సంబంధం లేని దేశాల మధ్య పంచాయితీకి మిగిలిన ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్న దుస్థితి. కొవిడ్ తర్వాత నుంచి పలు దేశాల మధ్య మొదలైన యుద్ధాలతో ప్రపంచం తల్లడిల్లుతున్న పరిస్థితి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా మొదలైన ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధం మరో ఎత్తు. పేరుకు ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్దం జరుగుతున్నప్పటికి.. పరోక్షంగా యూఏఈ మొత్తం యుద్ధ ప్రభావం నేరుగా పడుతున్న పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారత్ నుంచి అమెరికా, యూరోప్ వెళ్లే వారికి యూఏఈ గేట్ వే గా ఉండటం.. అక్కడ ఫ్లైట్ మారటంలాంటివి సర్వసాధారణం. యుద్ధం కారణంగా ఆ లింక్ తెగటంతో ఇప్పుడు ఆయా దేశాలకు విమాన ప్రయాణాలు ఇప్పుడు విపరీతమైన ఖర్చుతో కూడుకున్నవిగా మారాయి.

భారత్ నుంచి లండన్, న్యూయార్క్, ఫ్రాంక్ ఫర్ట్ లాంటి రూట్ల విమాన టికెట్ ధరలు గతానికి భిన్నంగా భారీగా పెరిగిన పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒక్కో టికెట్ ధర పది రెట్ల వరకు పెరిగాయి. లండన్, న్యూయార్క్ లాంటి మహానగరాలకు వెళ్లే విమానాలకు దుబాయ్ హబ్ గా ఉండేది. యుద్దం కారణంగా ఆ సర్వీసులు రద్దు అయ్యాయి.

దీంతో.. డైరెక్టు ఫ్లైట్లకు భారీగా గిరాకీ పెరిగింది. దీంతో టికెట్ల ధరలు ఆకాశానికి అంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే లండన్  నుంచి ముంబయి.. ఢిల్లీకి వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ కు సంబంధించి మిగిలిన ఆఖరి సీటుధర ఏకంగా రూ.9 లక్షలు పలకటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడి రోజుల్లో ఈ టికెట్ ధర రూ.1.5లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉండేది. అందుకు భిన్నంగా మూడు రెట్లకు పైనే టికెట్ ధర పెరగటం గమనార్హం.

హైదరాబాద్ – లండన్ మధ్య డైరెక్టు ఫ్లైట్ టికెట్ ధర రెట్టింపుఅయితే.. భారత్ నుంచి జర్మనీ (ఫ్రాంక్ ఫర్ట్)కు వళ్లే వాటి టికెట్ ధరలు 300 శాతం పెరిగాయి. అదే విధంగా అమెరికాకు వెళ్లే డైరెక్టు ఫ్లైట్ టికెట్  ధర కూడా భారీగా పెరిగాయి. దీంతో.. అమెరికా.. యూరోప్.. లండన్ కు వెళ్లే వారి జేబుకు చిల్లు పడుతున్న పరిస్థితి.

మామూలుగా అయితే.. లండన్ నుంచి ముంబయికి సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.20వేల నుంచి రూ.40వేల మధ్య ఉంటే.. ప్రస్తుతం రూ.2.90 గరిష్ఠ ధర పలుకుతుంది. లండన్ నుంచి ముంబయిలో బిజినెస్ క్లాస్ రూ.1.2 లక్షల నుంచి రూ.2.5లక్షలు పలికేది. ఆ టికెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ.9లక్షలకు చేరుకోవటం గమనార్హం. ఢిల్లీ – లండన్ మధ్య మామూలు రోజుల్లో 60 వేలు ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెరిగిపోయిన పరిస్థితి.

గల్ఫ్ దేశాల గగనతలం మూతపడటంతో ప్రతిరోజూ 700 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావటంతో.. విపరీతమైన డిమాండ్ పెరిగింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు.. వ్యాపారవేత్తలు.. అత్యవసర పని మీద వెళ్లాల్సిన కుటుంబాలు అయితే ఎంత ధర చెల్లించి అయినా టికెట్లు కొనేస్తున్నారు.

భారత్ నుంచి లండన్, న్యూయార్క్, ఫ్రాంక్ ఫర్ట్ వెళ్లే విమానాల కంటే.. అటువైపు నుంచి భారత్ కు వచ్చే విమాన టికెట్లకు డిమాండ్ భారీగా నెలకొన్న పరిస్థితి. పెరిగిన డిమాండ్ కు తగ్గట్లు భారత్ నుంచి ఈ నగరాలకు విమాన సర్వీసులు పెరగటం గమనార్హం. గతంలో ఢిల్లీ నుంచి లండన్ కు రోజుకు మూడు -నాలుగు విమాన సర్వీసులు ఉండేవి. ఇప్పుడు అవి కాస్తా 10-12కు సర్వీసులు పెరిగాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన విమాన టికెట్ ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

This post was last modified on March 5, 2026 6:23 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ… ఎవరీ న‌త్వానీ?

ప‌రిమ‌ళ్ న‌త్వానీ. ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ, ఈయ‌న పెద్ద పారిశ్రామిక వేత్త‌. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈయ‌న…

7 hours ago

చాంపియన్ అవుతారనుకుంటే చెత్తగా ఓడారు..

టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. అజేయంగా సెమీస్‌కు వచ్చిన ఆ జట్టు.. కీలక…

8 hours ago

ఇండస్ట్రీ చర్చగా మారిన టైటిల్స్ వ్యవహారం

హే భగవాన్ కంటెంట్ చూసి హే బలవంత్ గా మార్చమన్నారు. కపుల్ ఫ్రెండ్లి టైటిల్ లో వేరే అర్థం ఉందని…

8 hours ago

`చిరంజీవి` ఎఫెక్ట్‌… అక్క‌డి పాలిటిక్స్ మార‌తాయా ..!

చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్త‌రాంధ్ర‌లోని ఆముదాల‌వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని…

10 hours ago

శివాజీ జంటని ప్రేక్షకులు అంగీకరిస్తారా

ఒకప్పుడు హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన నటుడు శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి చాలా సంవత్సరాలయ్యింది. చిరంజీవి…

10 hours ago

బాలీవుడ్ బయ్యర్ల నరాలు చిట్లిపోతున్నాయ్

అంతా సవ్యంగా ఉంది, మార్చి 19 నుంచి థియేటర్లలో నాన్ స్టాప్ ఇరవై నాలుగు గంటలు షోలు వేసుకుంటూ పెద్ద…

11 hours ago