Trends

ఇరాన్ – ఇజ్రాయెల్ వార్: పెట్రోల్.. బంగారం.. పరిస్థితేంటి?

భారత స్టాక్ మార్కెట్‌కు ఈ వారం మరో చాలెంజ్ ఎదురైంది. గత శుక్రవారం సెన్సెక్స్ 961 పాయింట్లు, నిఫ్టీ 318 పాయింట్లు పడిపోయి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఈ పరిణామాలు సోమవారం మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఐదు అంశాలు ఈ వారం మన మార్కెట్ దిశను నిర్ణయించబోతున్నాయి.

మొదటిది ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం. ఇరాన్ కీలక నేతల మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భయాందోళనలో ఉన్నారు. రెండో అంశం ముడి చమురు ధరలు. ఇరాన్ పై దాడుల వల్ల పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. భారత్ తన చమురు అవసరాల కోసం సగానికి పైగా ఇరాన్ మీదున్న సముద్ర మార్గం పైనే ఆధారపడుతుంది కాబట్టి, ఇది మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారనుంది.

ఇక మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. యుద్ధ వాతావరణం వల్ల సోమవారం మార్కెట్ ఓపెన్ అవ్వగానే వీటి రేట్లు భారీగా పెరగవచ్చు. మరోవైపు అమెరికా మార్కెట్లలో ఐటీ షేర్లు బలహీనంగా ఉండటం కూడా మన నిఫ్టీ ఐటీపై ప్రభావం చూపిస్తుంది. ఈ వారం ఆటోమొబైల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండవచ్చు.

అయితే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే.. చాలా కాలం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు ఫిబ్రవరిలో భారత మార్కెట్లో సుమారు 2.44 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. కానీ ఈ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వారు మళ్ళీ వెనక్కి తగ్గుతారా లేక వేచి చూస్తారా అనేది కాలమే సమాధానం ఇవ్వాలి.

This post was last modified on March 1, 2026 10:20 am

Share
Show comments
Published by
Kumar
Tags: Gold rates

Recent Posts

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

22 minutes ago

జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…

50 minutes ago

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…

1 hour ago

“అస‌లు సిస‌లు ప్ర‌జా ద్రోహి కేజ్రీవాలే“

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజ‌యం ద‌క్కించుకుని.. ప్ర‌స్తుతం…

2 hours ago

దిల్ రాజు భలే తప్పించుకున్నారే…

తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…

2 hours ago

వైసీపీ టాక్‌: ఇక‌ స‌ర్వం స‌జ్జ‌లే!

వైసీపీలో మ‌రోసారి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి శ‌కం ప్రారంభం అవుతుంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌..…

4 hours ago