Trends

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో నిందితులు ఎవ‌రు? అస‌లీ దారుణం ఎలా జ‌రిగింది? అనే విష‌యాలు ఇప్ప‌టికీ తేల‌లేదు. విచారణ‌పై విచార‌ణ జ‌రిగినా.. ఇప్ప‌టికీ అయేషా మీరా కేసు మిలియ‌న్ డాల‌ర్ల స‌స్పెన్సుగానే ఉంది. రాష్ట్ర పోలీసులు.. సీఐడీ అధికారులు.. కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌లోని సీబీఐ అధికారులు సైతం ఈ కేసును విచారించారు. అయినా.. ఇప్ప‌టికీ దోషులు ఎవ‌రో తేల‌లేదు.

ఈ కేసు ముగింపు కోసం.. అయేషా మీరా త‌ల్లిదండ్రులు 19 సంవ‌త్స‌రాలుగా త‌ల్ల‌డిల్లుతున్నారు. ఏ ప్ర‌భుత్వం ఉంటే ఆ ప్ర‌భుత్వానికి విన్న‌పాలుచేస్తున్నారు. కేంద్రానికి లేఖ‌లు రాశారు. మాన‌వ హ‌క్కుల సంఘాల‌కు కూడా విన్న‌వించారు. అయినా.. ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఈ కేసులో తొలుత నిందితుడు అంటూ.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన పిడ‌త‌ల స‌త్యంబాబును అరెస్టు చేసి జైలు పాలు చేసినా.. ఆ త‌ర్వాత కోర్టు అత‌నిని నిర్దోషిగా విడుద‌ల చేసింది.

ఇక‌, సీబీఐ ఈ కేసు విచార‌ణ‌ను ముగించి ఏడాది అయినా ఇప్ప‌టి వ‌ర‌కు నివేదిక బ‌య‌ట‌కు రాలేదు. ఇలా ఉన్న ఈ కేసులో.. తాజాగా షాకింగ్ ప‌రిణామం చోటు చేసుకుంది. విజ‌య‌వాడ‌లోని సీబీఐ కోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయేషా మీరా శ‌రీర భాగాల‌ను ఆమె కుటుంబ స‌భ్యుల‌కు అందించాల‌ని.. వారి కుటుంబ సంప్ర‌దాయం ప్ర‌కారం అత్య‌క్రియ‌లు చేసుకునేందుకు అధికారులు అనుమ‌తించాల‌ని ఆదే శించింది. ఇదేస‌మ‌యంలో ఆయా శ‌రీర భాగాల‌ను భ‌ద్ర ప‌రిచిన ల్యాబ్‌కు కూడా సీబీఐ కోర్టుఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఈ నెల 27న ముస్లిం సంప్ర‌దాయ విధానంలో అంత్య‌క్రియ‌లు చేసేందుకు కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌య్యారు.

ఒక‌సారి అంత్య‌క్రియ‌లు పూర్తి..

వాస్త‌వానికి అయేషా మీరా అంత్య‌క్రియ‌లు గ‌తంలోనే ముగిశాయి. అయితే.. అప్ప‌ట్లో ప్ర‌భుత్వమే ఈ క్ర‌తువును నిర్వ‌హించింది. దీనిపైనా ఆమె త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భౌతిక దేహాన్ని సైతం త‌మకు అప్ప‌గించ‌లేద‌ని క‌న్నీరుమున్నీరు అయ్యారు. ఆ క్ర‌తువు అలా జ‌రిగిపోగా.. ఆమె శ‌రీరం నుంచి తీసిన కొన్ని భాగాల‌ను హైద‌రాబాద్‌లోని ఓ ల్యాబొరేట‌రీలో విచార‌ణ నిమిత్తం భ‌ద్ర ప‌రిచారు. ఇప్పుడు వాటిని కుటుంబానికి అప్ప‌గించాల‌ని సీబీఐ కోర్టు ఆదేశించింది.

అప్ప‌టి మంత్రి మ‌న‌వ‌డిపై..

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌నా కాలంలో 2007, డిసెంబ‌రులో విజ‌య‌వాడ శివారులోని ఇబ్ర‌హీంప‌ట్నంలో ఉన్న‌బీఫార్మ‌సీ కాలేజీలో ఓ రోజు తెల్ల‌వారుజామున అయేషా మీరాపై అత్యాచారం హ‌త్య జ‌రిగాయి. ఇది అప్ప‌ట్లో ఉమ్మ‌డి రాష్ట్రంలో పెను క‌ల‌క‌లానికి దారి తీసింది.

ఈ కేసులో అప్ప‌టి మంత్రి కోనేరు రంగారావు మ‌న‌వ‌డిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే కేసు విచార‌ణ కూడా దారిత‌ప్పింద‌ని అసెంబ్లీలో అప్ప‌టి విప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వ‌స్తే.. విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌న్నారు. ఇలా.. ఈ కేసు అనేక మ‌లుపులు తిరిగినా.. ఇప్ప‌టికీ త‌మ‌ కుటుంబానికి న్యాయం జ‌ర‌గ‌లేద‌ని అయేషా త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on February 21, 2026 1:18 pm

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

2 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

4 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

5 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

5 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

5 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

6 hours ago