Trends

ఇకపై డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తే…

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని చెప్పే ఘటనలు కోకొల్లలు. ఇక, కొందరు పొలిటియన్లయితే తమపై వచ్చిన లైంగిక ఆరోపణలనుంచి తప్పించుకునేందుకు డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐని వాడుకుంటున్నారు.

ఆ వీడియోల్లో ఉన్నది తాము కాదని, అది డీప్ ఫేక్ వీడియో అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాణేనికి మరోవైపు అన్నట్లు… మరికొందరు మాత్రం ఏఐకి క్రియేటివిటీని జోడించి అద్భుతమైన వీడియోలు రూపొందిస్తున్నారు. ఇంకొందరు మాత్రం తప్పుడు వీడియోలతో దుష్ప్రచారాలు చేస్తున్నారు.

అయితే, ఎటు చూసినా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఏఐ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ సాయంతో సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ లను అరికట్టేందుకు నడుం బిగించింది. ఐటీ నిబంధనలకు కీలక సవరణలు చేసిన కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

నూతన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ పై లేబులింగ్ చేయడం తప్పనిసరి. ఇది ఏఐ వీడియో అని స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఏఐ కంటెంట్ ను రూపొందించింది ఎవరు అన్న వివరాలు కూడా స్పష్టంగా ఉండాలని ఆదేశించింది.

ఇక, ఏఐ కంటెంట్ లేబుళ్లను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు తొలగించకూడదని నిబంధన విధించింది. అయితే, మార్గదర్శకాలు విడుదల చేయడం సులభమే. కానీ, ఆ మార్గదర్శకాలు పాటించని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందా లేక మార్గదర్శకాలకే పరిమితమై ఉదాసీన వైఖరితో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.

Kumar

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

59 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago