ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని చెప్పే ఘటనలు కోకొల్లలు. ఇక, కొందరు పొలిటియన్లయితే తమపై వచ్చిన లైంగిక ఆరోపణలనుంచి తప్పించుకునేందుకు డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐని వాడుకుంటున్నారు.
ఆ వీడియోల్లో ఉన్నది తాము కాదని, అది డీప్ ఫేక్ వీడియో అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాణేనికి మరోవైపు అన్నట్లు… మరికొందరు మాత్రం ఏఐకి క్రియేటివిటీని జోడించి అద్భుతమైన వీడియోలు రూపొందిస్తున్నారు. ఇంకొందరు మాత్రం తప్పుడు వీడియోలతో దుష్ప్రచారాలు చేస్తున్నారు.
అయితే, ఎటు చూసినా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఏఐ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ సాయంతో సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ లను అరికట్టేందుకు నడుం బిగించింది. ఐటీ నిబంధనలకు కీలక సవరణలు చేసిన కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
నూతన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ పై లేబులింగ్ చేయడం తప్పనిసరి. ఇది ఏఐ వీడియో అని స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఏఐ కంటెంట్ ను రూపొందించింది ఎవరు అన్న వివరాలు కూడా స్పష్టంగా ఉండాలని ఆదేశించింది.
ఇక, ఏఐ కంటెంట్ లేబుళ్లను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు తొలగించకూడదని నిబంధన విధించింది. అయితే, మార్గదర్శకాలు విడుదల చేయడం సులభమే. కానీ, ఆ మార్గదర్శకాలు పాటించని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందా లేక మార్గదర్శకాలకే పరిమితమై ఉదాసీన వైఖరితో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on February 10, 2026 6:25 pm
ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరు చేస్తామంటూ..…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…