Trends

ఇకపై డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తే…

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని చెప్పే ఘటనలు కోకొల్లలు. ఇక, కొందరు పొలిటియన్లయితే తమపై వచ్చిన లైంగిక ఆరోపణలనుంచి తప్పించుకునేందుకు డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐని వాడుకుంటున్నారు.

ఆ వీడియోల్లో ఉన్నది తాము కాదని, అది డీప్ ఫేక్ వీడియో అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాణేనికి మరోవైపు అన్నట్లు… మరికొందరు మాత్రం ఏఐకి క్రియేటివిటీని జోడించి అద్భుతమైన వీడియోలు రూపొందిస్తున్నారు. ఇంకొందరు మాత్రం తప్పుడు వీడియోలతో దుష్ప్రచారాలు చేస్తున్నారు.

అయితే, ఎటు చూసినా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఏఐ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ సాయంతో సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ లను అరికట్టేందుకు నడుం బిగించింది. ఐటీ నిబంధనలకు కీలక సవరణలు చేసిన కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

నూతన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ పై లేబులింగ్ చేయడం తప్పనిసరి. ఇది ఏఐ వీడియో అని స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఏఐ కంటెంట్ ను రూపొందించింది ఎవరు అన్న వివరాలు కూడా స్పష్టంగా ఉండాలని ఆదేశించింది.

ఇక, ఏఐ కంటెంట్ లేబుళ్లను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు తొలగించకూడదని నిబంధన విధించింది. అయితే, మార్గదర్శకాలు విడుదల చేయడం సులభమే. కానీ, ఆ మార్గదర్శకాలు పాటించని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందా లేక మార్గదర్శకాలకే పరిమితమై ఉదాసీన వైఖరితో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.

This post was last modified on February 10, 2026 6:25 pm

Share

Recent Posts

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

7 minutes ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

3 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

3 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

5 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

5 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

7 hours ago