కొద్దిసేపటి క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఒక పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకోకుండా బన్నీ టీమ్ చాలా వేగంగా స్పందించింది.
బన్నీని కలవడానికి 42 నిబంధనలు ఉంటాయని, ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదనే వింత రూల్స్ ఉన్నాయని ఒక మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం ఆడిన డ్రామానా అనే ఒక డౌట్ వస్తోంది.
ఇంటర్వ్యూ చేసిన యాంకర్ తన ఇన్స్టా స్టోరీలో “మనం వైరల్ అయిపోయాం.. అందరూ నన్ను ట్యాగ్ చేయండి” అంటూ పెట్టిన పోస్టులు చూస్తుంటే, రీచ్ కోసమే ఈ పని చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోందని బన్నీ ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు. బన్నీ టీమ్ ఈ వ్యవహారంపై అఫీషియల్ నోట్ రిలీజ్ చేస్తూ ఘాటుగా స్పందించింది.
ఆయన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా ఉంటారని స్పష్టం చేసింది. కేవలం వ్యూస్ కోసం ఒక స్టార్ హీరో ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని టీమ్ పేర్కొంది. ఇలాంటి ఫేక్ కంటెంట్ను స్ప్రెడ్ చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
నిజానికి సదరు యాంకర్ సబ్స్క్రైబర్లు 500 కూడా లేకపోవడంతో, రీచ్ పెంచుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్లు నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. తన రీల్ వైరల్ అయినందుకు ఆమె ఎంతో ఆనందపడుతూ పెట్టిన పోస్టులే ఇదొక ప్లాన్డ్ పబ్లిసిటీ స్టంట్ అని ఫ్యాన్స్ ఆమె స్టోరీ స్క్రీన్ షాట్స్ ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక లీగల్ నోటీసు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on February 10, 2026 6:34 pm
బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అది స్వపక్షమైనా..విపక్షమైనా.. ముందు వెనుక చూసుకోకుండా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు…
పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి…
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కూటమి పార్టీల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.…
ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో టైటిల్ కార్డ్స్ అన్నవి తప్పనిసరి అయిపోయాయి. జస్ట్ పేరు, దాని ముందు ఒక ట్యాగ్…
మాజీ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకం దుమారం రేపుతున్న సంగతి…