కొద్దిసేపటి క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఒక పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకోకుండా బన్నీ టీమ్ చాలా వేగంగా స్పందించింది.
బన్నీని కలవడానికి 42 నిబంధనలు ఉంటాయని, ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదనే వింత రూల్స్ ఉన్నాయని ఒక మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం ఆడిన డ్రామానా అనే ఒక డౌట్ వస్తోంది.
ఇంటర్వ్యూ చేసిన యాంకర్ తన ఇన్స్టా స్టోరీలో “మనం వైరల్ అయిపోయాం.. అందరూ నన్ను ట్యాగ్ చేయండి” అంటూ పెట్టిన పోస్టులు చూస్తుంటే, రీచ్ కోసమే ఈ పని చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోందని బన్నీ ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు. బన్నీ టీమ్ ఈ వ్యవహారంపై అఫీషియల్ నోట్ రిలీజ్ చేస్తూ ఘాటుగా స్పందించింది.
ఆయన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా ఉంటారని స్పష్టం చేసింది. కేవలం వ్యూస్ కోసం ఒక స్టార్ హీరో ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని టీమ్ పేర్కొంది. ఇలాంటి ఫేక్ కంటెంట్ను స్ప్రెడ్ చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
నిజానికి సదరు యాంకర్ సబ్స్క్రైబర్లు 500 కూడా లేకపోవడంతో, రీచ్ పెంచుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్లు నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. తన రీల్ వైరల్ అయినందుకు ఆమె ఎంతో ఆనందపడుతూ పెట్టిన పోస్టులే ఇదొక ప్లాన్డ్ పబ్లిసిటీ స్టంట్ అని ఫ్యాన్స్ ఆమె స్టోరీ స్క్రీన్ షాట్స్ ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక లీగల్ నోటీసు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on February 10, 2026 6:34 pm
ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరు చేస్తామంటూ..…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…