పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండాలనే ధ్యేయంతో ఆయన నిరంతరం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
చిన్న సమస్యైనా, పెద్ద సమస్యైనా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆయన పని తీరుకు ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తున్న పవన్ కళ్యాణ్, తాజాగా మరో ఇద్దరు చిన్నారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయి పూర్తిగా నిరాధారులయ్యారు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమ దుస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో సందేశంగా తెలియజేయగా, ఆ వీడియో ఉప ముఖ్యమంత్రిని కదిలించింది. వెంటనే స్పందించిన ఆయన ప్రతి నెలా ఒక్కొక్కరికి తన జీతం నుండి రూ.5 వేల చొప్పున, ఇద్దరికీ రూ.10 వేల ఆర్థిక సహాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశించారు.
అంతేకాకుండా, ఆ చిన్నారులకు తక్షణం పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని స్పష్టమైన సూచనలు చేశారు. వారి విద్యాభవిష్యత్తు దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్కు బాధ్యత అప్పగించారు.
నిరాధార చిన్నారులకు భరోసా ఇవ్వడమే కాకుండా, వారి భవిష్యత్తును సురక్షితం చేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం పిఠాపురం ప్రజల్లో సానుకూల స్పందన రేపుతోంది. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతగల కుటుంబ సభ్యుడిలాగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on February 10, 2026 10:02 pm
మహాసేన రాజేష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. యూట్యూబర్గా ప్రారంభమైన రాజేష్ ప్రస్థానం తర్వాత కాలంలో రాజకీయాల వైపు…
ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1999లో విడుదలైన ది మమ్మీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రెండో భాగంగా…
ఏ బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త కుర్రాడు.. లుక్స్ పరంగా చూస్తే హీరోలా అనిపించడు.. అలాంటోడు తొలి చిత్రంతోనే వంద…
లోక్ సభలో ఒక చారిత్రాత్మక బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఎన్డీఏ ఓటింగ్ లో ఓటమి ఫాలయింది. నియోజకవర్గాల పునర్విభజన,…
టాలీవుడ్ స్టార్ హీరోలు స్టేజ్ ఎక్కితే చాలు, ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాలు పక్కా అని ఫ్యాన్స్కు హామీ…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు... తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్…