పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండాలనే ధ్యేయంతో ఆయన నిరంతరం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
చిన్న సమస్యైనా, పెద్ద సమస్యైనా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆయన పని తీరుకు ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తున్న పవన్ కళ్యాణ్, తాజాగా మరో ఇద్దరు చిన్నారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయి పూర్తిగా నిరాధారులయ్యారు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమ దుస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో సందేశంగా తెలియజేయగా, ఆ వీడియో ఉప ముఖ్యమంత్రిని కదిలించింది. వెంటనే స్పందించిన ఆయన ప్రతి నెలా ఒక్కొక్కరికి తన జీతం నుండి రూ.5 వేల చొప్పున, ఇద్దరికీ రూ.10 వేల ఆర్థిక సహాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశించారు.
అంతేకాకుండా, ఆ చిన్నారులకు తక్షణం పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని స్పష్టమైన సూచనలు చేశారు. వారి విద్యాభవిష్యత్తు దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్కు బాధ్యత అప్పగించారు.
నిరాధార చిన్నారులకు భరోసా ఇవ్వడమే కాకుండా, వారి భవిష్యత్తును సురక్షితం చేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం పిఠాపురం ప్రజల్లో సానుకూల స్పందన రేపుతోంది. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతగల కుటుంబ సభ్యుడిలాగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on February 10, 2026 10:02 pm
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…