న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. జనవరి 21న నాగ్పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో కివీస్ను చిత్తు చేసి, 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో బోణి కొట్టింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్, అర్ష్దీప్ సింగ్ పదునైన బౌలింగ్తో భారత్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి కివీస్ బౌలర్లను వణికించాడు. అతనికి తోడుగా రింకూ సింగ్ (44), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) వేగంగా పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేమీసన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేస్తూ 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. మార్క్ చాప్మన్ 39 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో 2 వికెట్లు తీయగా, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.
మొత్తానికి వన్డే సిరీస్ కోల్పోయిన కసిని భారత్ ఈ మ్యాచ్లో చూపించింది. అయితే భారీ స్కోరు సాధించినా, ఫీల్డింగ్లో కొన్ని క్యాచ్లు వదిలేయడం, బుమ్రా లాంటి ప్రధాన బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం టీమ్ మేనేజ్మెంట్ను కొంత ఆందోళనకు గురిచేసే అంశం. వచ్చే మ్యాచ్ల్లో ఈ లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియా సిరీస్పై పట్టు సాధించడం ఖాయం.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…