న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. జనవరి 21న నాగ్పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో కివీస్ను చిత్తు చేసి, 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో బోణి కొట్టింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్, అర్ష్దీప్ సింగ్ పదునైన బౌలింగ్తో భారత్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి కివీస్ బౌలర్లను వణికించాడు. అతనికి తోడుగా రింకూ సింగ్ (44), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) వేగంగా పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేమీసన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేస్తూ 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. మార్క్ చాప్మన్ 39 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో 2 వికెట్లు తీయగా, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.
మొత్తానికి వన్డే సిరీస్ కోల్పోయిన కసిని భారత్ ఈ మ్యాచ్లో చూపించింది. అయితే భారీ స్కోరు సాధించినా, ఫీల్డింగ్లో కొన్ని క్యాచ్లు వదిలేయడం, బుమ్రా లాంటి ప్రధాన బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం టీమ్ మేనేజ్మెంట్ను కొంత ఆందోళనకు గురిచేసే అంశం. వచ్చే మ్యాచ్ల్లో ఈ లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియా సిరీస్పై పట్టు సాధించడం ఖాయం.
This post was last modified on January 21, 2026 11:01 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…