కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం అక్కడ పెను దుమారం రేపుతోంది. ఒక మహిళ అకారణంగా తన మీద నింద వేసి, మానసిక క్షోభకు గురి చేయడం అతడి ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో కేరళలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న పురుషులందరూ విచిత్ర రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..?
కొన్ని రోజుల కిందట షింజిత ముస్తఫా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. తన ఇన్స్టా పేజీలో ఒక వీడియోను షేర్ చేశారు. బస్సులో తనతో కలిసి ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకుతున్నట్లుగా ఆమె ఆరోపించారు. ఐతే ఆ వీడియోలో ఆ ఉద్దేశపూర్వకంగా ఆ మహిళను తాకుతున్న సంకేతాలేమీ లేవు. ఆమే అతడికి దగ్గరగా వెళ్లి అతడి చేయి తనకు తాకేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు దీపక్ అని వెల్లడైంది. అతణ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఒక ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పని చేసే దీపక్.. తాను నివాసముండే కోళికోడ్లో, అలాగే పని చేసే కంపెనీలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
తన వ్యక్తిత్వాన్ని అందరూ ప్రశ్నించడంతో అతను తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళలో దుమారం రేపింది.
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం షింజిత అకారణంగా ఒక వ్యక్తి మీద నింద వేసి అతడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందంటూ ఆమె మీద ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. దీపక్ తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు షింజిత మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని సమాచారం.
మరోవైపు కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న పురుషులు.. మహిళలకు తాకకుండా అట్ట పెట్టెలను ఒంటికి చుట్టుకుని దీపక్ ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీపక్కు మద్దతుగా ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి.
This post was last modified on January 20, 2026 3:04 pm
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…