నోయిడాలో దట్టమైన మంచు కురుస్తున్న వేళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయిన తీరు అందరినీ కలిచివేస్తోంది. గుర్గావ్లో టెక్కీగా పనిచేస్తున్న 27 ఏళ్ల యువరాజ్ మెహతా, శుక్రవారం అర్ధరాత్రి తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం, అక్కడ కనీసం రిఫ్లెక్టర్లు కూడా లేకపోవడంతో అతని కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న ఒక భవనం తాలూకు 70 అడుగుల లోతైన నీటి గుంతలోకి దూసుకెళ్లింది.
కారు నీటిలో మునిగిపోతున్న సమయంలో యువరాజ్ తన తండ్రికి ఫోన్ చేసి చేసిన ఆఖరి సంభాషణ గుండెలను పిండేస్తోంది. “నాన్నా.. నేను లోతైన నీటి గుంతలో పడిపోయాను, మునిగిపోతున్నాను.. ప్లీజ్ నన్ను కాపాడండి, నాకు చావాలని లేదు” అంటూ తండ్రిని వేడుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ సైలెంట్ అయిపోయింది. అటుగా వెళ్తున్న వారు అతని అరుపులు విని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
ప్రమాదం జరిగిన గంటన్నర వరకు యువరాజ్ ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే రెస్క్యూ టీమ్స్ ఆలస్యంగా స్పందించాయని బాధితుడి స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి కారును, యువరాజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే కొడుకు శవమై బయటకు రావడంతో ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణం పోయిందని, డ్రైనేజీలపై మూతలు లేకపోవడం, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి, ఆ లోతైన గుంతను చెత్త వ్యర్థాలతో నింపేసి చేతులు దులుపుకోవడం గమనార్హం.
బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు బిల్డర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్స్ట్రక్షన్ కంపెనీలపై అజాగ్రత్త వల్ల మరణానికి కారణమైనందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇంత లోతైన గుంతను వదిలేసినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.
This post was last modified on January 18, 2026 9:24 pm
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…