సోషల్ మీడియాలో ఇటీవల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్లు, బైకులు, ప్లాట్లు, ఖరీదైన గాడ్జెట్లు ఇస్తామని రీల్స్ చేసి, అమాయకులను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
ఇంతకుముందు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లతో డబ్బులు చేసుకున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, ఇప్పుడు అదే మోసాన్ని లక్కీ డ్రాల రూపంలో కొనసాగిస్తున్నారు. భారీ బహుమతులు గెలుస్తారని నమ్మించి, చిన్న మొత్తాలు చెల్లించమని చెప్పి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుంటున్నారు.
ఈ తరహా లక్కీ డ్రాలు చట్టవిరుద్ధమని, ప్రజలను మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. Prize Chits and Money Circulation Schemes Banning Act 1978 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటే చట్టం ముందు తప్పించుకునే అవకాశం ఉండదన్నారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లక్కీ డ్రాలు, భారీ బహుమతుల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే హడావుడికి మోసపోకుండా, నిజమైన సమాచారం తెలుసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
This post was last modified on January 17, 2026 1:21 pm
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…