సోషల్ మీడియాలో ఇటీవల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్లు, బైకులు, ప్లాట్లు, ఖరీదైన గాడ్జెట్లు ఇస్తామని రీల్స్ చేసి, అమాయకులను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
ఇంతకుముందు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లతో డబ్బులు చేసుకున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, ఇప్పుడు అదే మోసాన్ని లక్కీ డ్రాల రూపంలో కొనసాగిస్తున్నారు. భారీ బహుమతులు గెలుస్తారని నమ్మించి, చిన్న మొత్తాలు చెల్లించమని చెప్పి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుంటున్నారు.
ఈ తరహా లక్కీ డ్రాలు చట్టవిరుద్ధమని, ప్రజలను మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. Prize Chits and Money Circulation Schemes Banning Act 1978 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటే చట్టం ముందు తప్పించుకునే అవకాశం ఉండదన్నారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లక్కీ డ్రాలు, భారీ బహుమతుల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే హడావుడికి మోసపోకుండా, నిజమైన సమాచారం తెలుసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…