Trends

సంక్రాంతికి అది అమ్మితే హత్యాయత్నం కేసు!

సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో పతంగులు ఎగురవేయొద్దని, నిషేధం విధించిన చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా చాలామంది ఆ మాట పెడచెవిన పెడుతున్నారు.

ఈ సంక్రాంతి సందర్భంగా కూడా చైనా మాంజా బారిన పడి ఇద్దరు మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే చైనా మాంజా కట్టడి కోసం నిజామాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.

చైనా మాంజా అమ్మితే హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నారు. నిజామాబాద్ లో ఆల్రెడీ ఐదుగురు వ్యాపారులపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి 35 బండిళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా విక్రయాల కట్టడికి ఇటువంటి కఠిన చర్యలు తప్పడం లేదని చెబుతున్నారు.

మాంజా విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న వెంటనే ఆ దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా, సూచనలు చేస్తున్నా వినకపోవడంతోనే హత్యాయత్నం కేసులు నమోదు చేయాల్సి వస్తోందని పోలీసులు అంటున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లాలో చైనా మాంజా మరొకరిని బలి తీసుకుంది. ఫసల్వాది గ్రామంలో చైనా మాంజా తగిలి బైక్ పై వెళుతున్న వ్యక్తి గొంతు తెగిపోయింది. బైక్ మీద వెళ్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన అవిదేశ్‌కు చైనా మాంజ మెడకు బలం తగలడంతో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ తర్వాత అతడు మృతి చెందాడు. యూపీ నుండి కూలీ పని కోసం సంగారెడ్డికి నిన్న వచ్చిన అవిదేశ్ ను చైనా మాంజా బలి తీసుకుంది. దీంతో, లోహ్రీ పండుగ నాడు అవిదేశ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

This post was last modified on January 15, 2026 1:45 pm

Share
Show comments
Published by
Kumar
Tags: China Manja

Recent Posts

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

22 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

44 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

6 hours ago