Trends

సంక్రాంతికి అది అమ్మితే హత్యాయత్నం కేసు!

సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో పతంగులు ఎగురవేయొద్దని, నిషేధం విధించిన చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా చాలామంది ఆ మాట పెడచెవిన పెడుతున్నారు.

ఈ సంక్రాంతి సందర్భంగా కూడా చైనా మాంజా బారిన పడి ఇద్దరు మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే చైనా మాంజా కట్టడి కోసం నిజామాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.

చైనా మాంజా అమ్మితే హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నారు. నిజామాబాద్ లో ఆల్రెడీ ఐదుగురు వ్యాపారులపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి 35 బండిళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా విక్రయాల కట్టడికి ఇటువంటి కఠిన చర్యలు తప్పడం లేదని చెబుతున్నారు.

మాంజా విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న వెంటనే ఆ దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా, సూచనలు చేస్తున్నా వినకపోవడంతోనే హత్యాయత్నం కేసులు నమోదు చేయాల్సి వస్తోందని పోలీసులు అంటున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లాలో చైనా మాంజా మరొకరిని బలి తీసుకుంది. ఫసల్వాది గ్రామంలో చైనా మాంజా తగిలి బైక్ పై వెళుతున్న వ్యక్తి గొంతు తెగిపోయింది. బైక్ మీద వెళ్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన అవిదేశ్‌కు చైనా మాంజ మెడకు బలం తగలడంతో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ తర్వాత అతడు మృతి చెందాడు. యూపీ నుండి కూలీ పని కోసం సంగారెడ్డికి నిన్న వచ్చిన అవిదేశ్ ను చైనా మాంజా బలి తీసుకుంది. దీంతో, లోహ్రీ పండుగ నాడు అవిదేశ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Kumar

Recent Posts

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

41 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

7 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

8 hours ago