Trends

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి పందేలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఒక‌ప్పుడు గోదావ‌రి జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కోడి పందేలు.. పొట్టేలు పందేలు.. త‌ర్వాత త‌ర్వాత‌.. కొన్ని కొన్ని చుట్టుప‌క్క‌ల గ్రామాల‌కు పాకాయి. అయితే.. రాను రాను ఇప్పుడు గోదావ‌రి, కృష్ణాన‌దుల‌ను కూడా దాటుకుని.. ప్రాంతాల‌కు.. రాష్ట్రాల‌కు కూడా విస్త‌రిస్తున్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే..ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు చేసే హ‌డావుడి కోడి పందేలకు చేస్తున్నారు.

భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తున్నారు. విందు వినోదాల‌తోపాటు.. కోడిపందేల‌కు వ‌చ్చే పందెంరాయుళ్ల‌కు ఆహ్వాన ప‌త్రాలు కూడా ఈ ఏడాది అందించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇదంతా గుట్టుచ‌ప్పుడు కాకుండా సాగుతోంది.

విజ‌య‌వాడ స‌హా.. కృష్ణాజిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున కోడి పందేల శిబిరాలు వెలిశాయి. ఇదేదో చాటు మాటు అనుకుంటే పొర‌పాటే.. బ‌హిరంగ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ‌రులు ఏర్పాటు చేశారు. వాటిలో ఎల్ ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ, సాధార‌ణ‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. అంటూ.. ఇలా నాలుగు ర‌కాలుగా బ‌రుల్లో సీటింగ్ సౌక‌ర్యం ఏర్పాటు చేశారు.

వ‌చ్చే వారికి విందు ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. నాన్ వెజ్ స‌హా చైనీస్, స‌ముద్ర ఆహారం ఇలా.. అనేక ర‌కాల నాన్ వెజ్ ప‌దార్థాల‌ను ఏర్పాటు చేశారు. విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ముఖ హోట‌ల్‌కు క్యాట‌రింగ్ ఇచ్చారు. సుమారు 10 వేల మంది వీవీఐపీల‌కు భోజ‌నంవ‌డ్డించే బాధ్య‌త‌ను ఈ సంస్థ‌కు అప్ప‌గించారు.

ఒక్కొక్క ప్లేట్ 3 వేల రూపాయ‌ల చొప్పున ఈ సంస్థ వ‌సూలు చేస్తోందంటే.. ఏ రేంజ్‌లో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయో తెలుస్తోంది. ఇక‌, సాధార‌ణ పందెం.. 50 వేల కు పైమాటేనని పందెం రాయుళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌లు కూడా వెలుగులోకి వ‌స్తున్నాయి.

హైద‌రాబాద్ శివారులో..

ఇక‌, తెలంగాణ‌లో కోడిపందేల‌కు ఒక‌ప్పుడు చోటు లేదు. కానీ.. ఈ సారి హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల‌ప్రాంతాల్లో 100కు పైగా కోడిపందేల బ‌రులు వెలిశాయి. చిత్రం ఏంటంటే.. ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా బ‌రులు వేయొద్ద‌ని.. కోడి పందేలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని తేల్చి చెప్పాయి.

కానీ.. ఈ ఆదేశాలు.. ఆ మూడు రోజులు కోర్టు గ‌డ‌ప‌ల‌కే ప‌రిమితం అవుతున్నాయి. ఇదిలావుంటే.. గ‌తంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నాయ‌కులే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రో చిత్రం ఏంటంటే.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా నిత్యం కొట్టుకునే.. టీడీపీ-జ‌న‌సేన‌-వైసీపీ నాయ‌కులు ఈ ద‌ఫా క‌లిసిపోయారు.

Kumar

Recent Posts

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

2 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

6 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

7 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

9 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

9 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

11 hours ago