మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి పందేలు ప్రధాన ఆకర్షణ. ఒకప్పుడు గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన కోడి పందేలు.. పొట్టేలు పందేలు.. తర్వాత తర్వాత.. కొన్ని కొన్ని చుట్టుపక్కల గ్రామాలకు పాకాయి. అయితే.. రాను రాను ఇప్పుడు గోదావరి, కృష్ణానదులను కూడా దాటుకుని.. ప్రాంతాలకు.. రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే..ఐపీఎల్ మ్యాచ్లకు చేసే హడావుడి కోడి పందేలకు చేస్తున్నారు.
భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. విందు వినోదాలతోపాటు.. కోడిపందేలకు వచ్చే పందెంరాయుళ్లకు ఆహ్వాన పత్రాలు కూడా ఈ ఏడాది అందించడం గమనార్హం. అయితే.. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.
విజయవాడ సహా.. కృష్ణాజిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున కోడి పందేల శిబిరాలు వెలిశాయి. ఇదేదో చాటు మాటు అనుకుంటే పొరపాటే.. బహిరంగ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. వాటిలో ఎల్ ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ, సాధారణ, మధ్యతరగతి.. అంటూ.. ఇలా నాలుగు రకాలుగా బరుల్లో సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
వచ్చే వారికి విందు ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. నాన్ వెజ్ సహా చైనీస్, సముద్ర ఆహారం ఇలా.. అనేక రకాల నాన్ వెజ్ పదార్థాలను ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ హోటల్కు క్యాటరింగ్ ఇచ్చారు. సుమారు 10 వేల మంది వీవీఐపీలకు భోజనంవడ్డించే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు.
ఒక్కొక్క ప్లేట్ 3 వేల రూపాయల చొప్పున ఈ సంస్థ వసూలు చేస్తోందంటే.. ఏ రేంజ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయో తెలుస్తోంది. ఇక, సాధారణ పందెం.. 50 వేల కు పైమాటేనని పందెం రాయుళ్ల మధ్య జరుగుతున్న చర్చలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ శివారులో..
ఇక, తెలంగాణలో కోడిపందేలకు ఒకప్పుడు చోటు లేదు. కానీ.. ఈ సారి హైదరాబాద్ చుట్టుపక్కలప్రాంతాల్లో 100కు పైగా కోడిపందేల బరులు వెలిశాయి. చిత్రం ఏంటంటే.. ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా బరులు వేయొద్దని.. కోడి పందేలు నిర్వహించవద్దని తేల్చి చెప్పాయి.
కానీ.. ఈ ఆదేశాలు.. ఆ మూడు రోజులు కోర్టు గడపలకే పరిమితం అవుతున్నాయి. ఇదిలావుంటే.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నాయకులే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో చిత్రం ఏంటంటే.. రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం కొట్టుకునే.. టీడీపీ-జనసేన-వైసీపీ నాయకులు ఈ దఫా కలిసిపోయారు.
This post was last modified on January 11, 2026 10:21 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…