మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి పందేలు ప్రధాన ఆకర్షణ. ఒకప్పుడు గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన కోడి పందేలు.. పొట్టేలు పందేలు.. తర్వాత తర్వాత.. కొన్ని కొన్ని చుట్టుపక్కల గ్రామాలకు పాకాయి. అయితే.. రాను రాను ఇప్పుడు గోదావరి, కృష్ణానదులను కూడా దాటుకుని.. ప్రాంతాలకు.. రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే..ఐపీఎల్ మ్యాచ్లకు చేసే హడావుడి కోడి పందేలకు చేస్తున్నారు.
భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. విందు వినోదాలతోపాటు.. కోడిపందేలకు వచ్చే పందెంరాయుళ్లకు ఆహ్వాన పత్రాలు కూడా ఈ ఏడాది అందించడం గమనార్హం. అయితే.. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.
విజయవాడ సహా.. కృష్ణాజిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున కోడి పందేల శిబిరాలు వెలిశాయి. ఇదేదో చాటు మాటు అనుకుంటే పొరపాటే.. బహిరంగ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. వాటిలో ఎల్ ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ, సాధారణ, మధ్యతరగతి.. అంటూ.. ఇలా నాలుగు రకాలుగా బరుల్లో సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
వచ్చే వారికి విందు ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. నాన్ వెజ్ సహా చైనీస్, సముద్ర ఆహారం ఇలా.. అనేక రకాల నాన్ వెజ్ పదార్థాలను ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ హోటల్కు క్యాటరింగ్ ఇచ్చారు. సుమారు 10 వేల మంది వీవీఐపీలకు భోజనంవడ్డించే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు.
ఒక్కొక్క ప్లేట్ 3 వేల రూపాయల చొప్పున ఈ సంస్థ వసూలు చేస్తోందంటే.. ఏ రేంజ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయో తెలుస్తోంది. ఇక, సాధారణ పందెం.. 50 వేల కు పైమాటేనని పందెం రాయుళ్ల మధ్య జరుగుతున్న చర్చలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ శివారులో..
ఇక, తెలంగాణలో కోడిపందేలకు ఒకప్పుడు చోటు లేదు. కానీ.. ఈ సారి హైదరాబాద్ చుట్టుపక్కలప్రాంతాల్లో 100కు పైగా కోడిపందేల బరులు వెలిశాయి. చిత్రం ఏంటంటే.. ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా బరులు వేయొద్దని.. కోడి పందేలు నిర్వహించవద్దని తేల్చి చెప్పాయి.
కానీ.. ఈ ఆదేశాలు.. ఆ మూడు రోజులు కోర్టు గడపలకే పరిమితం అవుతున్నాయి. ఇదిలావుంటే.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నాయకులే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో చిత్రం ఏంటంటే.. రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం కొట్టుకునే.. టీడీపీ-జనసేన-వైసీపీ నాయకులు ఈ దఫా కలిసిపోయారు.
This post was last modified on January 11, 2026 10:21 pm
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…
నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…
పదిమందిని మెప్పించగల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఆకర్షించగల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాలన్నీ మీవే!. త్వరలోనే..…
“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?…