Trends

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం ప్రియుల్లో బడాబాబులు కూడా ఎంతో మంది ఉన్నారు. మందుబాబులు తీసుకునే లిక్కర్ వందల్లో ఉంటే, బడాబాబులు తాగే మద్యం ఖరీదు వేలల్లో ఉంటుంది. ఒక్కొక్క బాటిల్ కనీస ధర 20,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇక లక్షల వరకు కూడా మద్యం ధర పలుకుతోంది.

అయితే ఎవరి స్థాయి వారిది. ఎవరి స్థాయిని బట్టి వారు మద్యం కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడే కల్తీ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఏపీలో చిన్నపాటి మద్యం కల్తీ వ్యవహారమే కలకలం రేపింది. కానీ హైదరాబాద్ కేంద్రంగా ఖరీదైన మద్యంలోనూ కల్తీ ముఠా కనిపించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

పోనీ బాటిల్ లో ఏమైనా తేడా ఉంటుందా అంటే, దాన్ని గుర్తించడం దానిని మార్చిన వాడికే సాధ్యం కావడం లేదు. అంత పక్కాగా ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు.

తాజాగా 20,000 రూపాయల ఖరీదైన మద్యం బాటిళ్ల కల్తీ ముఠాను హైదరాబాద్ కు చెందిన ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా తీగ లాగితే ఒడిశా వరకు నకిలీ ముఠా ఆనవాళ్లు బయటపడ్డాయి. ఖరీదైన మద్యం బాటిళ్లలో చౌకైన మద్యాన్ని కలిపేసి 10,000 రూపాయలకు విక్రయిస్తున్నారు.

అదేమంటే స్మగుల్డ్ బాటిల్స్ అంటూ కలరింగ్ ఇస్తున్నారు. దీంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.

ఈ కల్తీ ముఠా గచ్చిబౌలి కేంద్రంగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే కల్తీ ప్రక్రియ మాత్రం ఒడిశాలో జరుగుతోంది. అక్కడి నుంచి రవాణా అయి హైదరాబాద్ లోని బడాబాబుల ఇళ్లకు చేరుతోంది.

కాబట్టి ఖరీదైందే కదా అని నమ్మి తాగేస్తే నకిలీ మద్యం ప్రాణాలకే ముప్పుగా మారుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఏం చేయాలి?

ఈ నేపథ్యంలో కల్తీ ముఠా బారిన పడకుండా నిర్దేశిత ఔట్ లెట్ల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే స్కానింగ్ చేసి పరిశీలించాలని చెబుతున్నారు. అయినా ఖరీదైన మద్యం నిజమైనదే అన్న పూర్తి సంతృప్తి దక్కుతుందా అంటే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on January 11, 2026 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

8 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

21 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

3 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

6 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

6 hours ago