కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన బ్లోఅవుట్ ఘటన ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో చెలరేగిన మంటలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందాలు అహోరాత్రులు శ్రమించి పూర్తిగా ఆర్పివేశాయి.
ప్రమాద తీవ్రత దృష్ట్యా తొలుత బావి చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకుని, గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణులు, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలతో మంటలపై దశలవారీగా నియంత్రణ సాధించారు.
మంటలు ఆరిపోయిన అనంతరం ప్రమాద స్థలంలో విరిగిపడిన భారీ యంత్ర సామాగ్రి, ఇనుప శకలాలను క్రేన్ల సహాయంతో తొలగించారు. బావి చుట్టూ ఇంకా అధిక ఉష్ణోగ్రత ఉండటంతో ‘వాటర్ అంబ్రెల్లా’ పద్ధతిలో నిరంతరంగా నీటిని చిలకరిస్తూ శీతలీకరణ చర్యలు చేపట్టారు.
బావిని శాశ్వతంగా నియంత్రించేందుకు ‘వెల్ క్యాపింగ్’ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు కీలకమైన భారీ బ్లోఅుట్ ప్రివెంటర్ను బావిపై అమర్చేందుకు ఓఎన్జీసీ సాంకేతిక బృందాలు సిద్ధమయ్యాయి. ఈ పరికరం అమర్చిన వెంటనే గ్యాస్ ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుందని అధికారులు వెల్లడించారు.
బ్లోఅవుట్ ఘటన అదుపులోకి రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు బావి వద్దే నిపుణుల బృందం మకాం వేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తుందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.
This post was last modified on January 10, 2026 4:17 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…