సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి గాలిపటాలు ఎగరేయడంలో వచ్చే కిక్కే వేరు. అయితే, గాలిపటం ఎగరేసేందుకు దారాన్ని ఉపయోగిస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కానీ, చైనా మాంజాతో గాలిపటం ఎగరేస్తే మాత్రం మన వినోదం మరొకరికి ప్రాణ సంకటం కావొచ్చు. చైనా మాంజాపై నిషేధం ఉన్నా, వాడొద్దని ఎంత మొత్తుకుంటున్నా చాలామంది వినడం లేదు. ఈ క్రమంలోనే యువకులకు చైనా మాంజా ఎంత ప్రమాదకరమో తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
చైనా మాంజా ఎంత డేంజరో ప్రాక్టికల్ గా చూపించి మరీ అవగాహన కల్పిస్తున్నారు. ఓ పిల్లవాడి ముందు చైనా మాంజాతో దోసకాయ కట్ చేసి చూపించారు మలక్ పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై కే. రాము.
ఆ మాంజా ఎంత పదునుగా ఉందో చూసి ఆ పిల్లాడు షాకయ్యాడు. ఇలాంటి మాంజా ఒక మనిషి మెడకు తగిలితే మెడ కట్ అయి తీవ్రగాయాలపాలవుతాడని వివరించారు. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుందని చెప్పారు.
అంతేకాదు, నిషేధించిన చైనా మాంజా వాడడం నేరమని, అయినా సరే వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి, ప్రజలందరూ దారాలతో తయారైన గాలిపటాలు మాత్రమే ఎగరేయాలని కోరారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి, పోలీసుల సలహాను ఈ సారైన ప్రజలంతా పాటిస్తారో లేక ఎవరెలా చస్తే మాకెందుకు…మాకు నచ్చినట్లు చైనా మాంజాతోనే పతంగులు ఎగరేస్తాం అని పంతం పడతారా అన్నది వేచి చూడాలి.
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…