జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల రాజ్ షమనీ పాడ్కాస్ట్లో కనిపించినప్పుడు, ఆయన తలకి ఒక చిన్న మెటాలిక్ క్లిప్ ఉండటం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. కొందరేమో అది చూయింగ్ గమ్ అని, మరికొందరు ఛార్జింగ్ ప్యాడ్ అని రకరకాల మీమ్స్ చేశారు. కానీ అది ఒక సీరియస్ హెల్త్ గ్యాడ్జెట్ అని, దాని పేరు ‘టెంపుల్’ అని తర్వాత తెలిసింది.
ఈ ‘టెంపుల్’ పరికరం మెదడుకు వెళ్లే రక్త ప్రవాహాన్ని నిరంతరం ట్రాక్ చేయడానికి డిజైన్ చేశారు. ‘గ్రావిటీ ఏజింగ్ హైపోథసిస్’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. గ్రావిటీ వల్ల గుండె రక్తాన్ని మెదడుకు పంప్ చేయడం కష్టమవుతుందని, దీనివల్ల వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు తగ్గుతుందని గోయల్ నమ్ముతున్నారు.
ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు, కేవలం ప్రయోగ దశలోనే ఉంది. ఇది జోమాటో ప్రాడక్ట్ కాదు, ‘కంటిన్యూ రీసెర్చ్’ అనే హెల్త్ టెక్ స్టార్టప్ కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికోసం గోయల్ ఇప్పటికే దాదాపు 25 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 208 కోట్లు సొంత డబ్బును పెట్టుబడి పెట్టారని సమాచారం.
అయితే వైద్య నిపుణులు మాత్రం దీని పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల మీద పెట్టుకునే చిన్న క్లిప్ ద్వారా మెదడు లోపలి రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా కొలవలేమని ముంబైకి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వనాథన్ అయ్యర్ అంటున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా మాత్రమే అది సాధ్యమని, ఇలాంటివి కేవలం వెల్నెస్ ప్రయోగాలే తప్ప మెడికల్ పరికరాలు కావని ఆయన స్పష్టం చేశారు.
గ్రావిటీ వల్ల మెదడు వయసు పెరుగుతుందన్న సిద్ధాంతాన్ని కూడా డాక్టర్లు కొట్టిపారేస్తున్నారు. గ్రావిటీ లేని అంతరిక్షంలో ఉండే ఆస్ట్రోనాట్స్ కు కూడా వయసు పెరుగుతుందని న్యూరాలజిస్ట్ మధుకర్ భరద్వాజ్ లాజిక్ చెప్పారు. ఎయిమ్స్ డాక్టర్ దత్తా అయితే దీన్ని “బిలియనీర్లు ఆడుకునే ఖరీదైన బొమ్మ”గా అభివర్ణించారు. ప్రస్తుతానికి దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు.
This post was last modified on January 5, 2026 9:44 pm
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…
తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…
వైసీపీ అధినేత జగన్.. తన సతీమణి భారతితో కలిసి.. యూరప్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…