Trends

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే: పనిమంతులకు కలిసొచ్చిన 2025!

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. పనిచేసేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ సంవత్సరం అనుకూలంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలు వివాదాలకు దూరంగా ఉండి ప్రజలకు చేరువయ్యారు. అదే సమయంలో అభివృద్ధిని నమ్ముకుని ముందుకు సాగుతున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగడమే కాక ప్రజలతో దగ్గరయ్యే అవకాశం ఏర్పడింది.

తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తొలిసారి ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు చేరువ కావడంలో ముందున్నారు. సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు రాజధానికి సంబంధించిన రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పెదకూరపాడు నుంచి తొలిసారి విజయం సాధించిన భాష్యం ప్రవీణ్ కూడా ప్రజలకు చేరువ కావడంలో సక్సెస్ అయ్యారు. ఆది నుంచే భారీ అంచనాలతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన ఆయన అదే గ్రాఫ్‌ను నిలబెట్టుకుంటున్నారు.

ఇక విశాఖపట్నం నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలోనూ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని కీలక అంశాలు మినహా మిగిలిన విషయాల్లో వారు విజయవంతమయ్యారనే చెప్పాలి. కలివి ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఒకరంటే ఒకరికి పడకపోవడంతో నాయకులు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరించుకుంటే తిరుగులేని శక్తిగా మారతారనడంలో సందేహం లేదు.

ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ప్రజలకు చేరువ కావడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రూరల్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. నెల నెలా జరిగే పింఛన్ పంపిణీలోనూ పాల్గొన్నారు.

ఇక దెందులూరు, పాలకొల్లు నియోజకవర్గాలు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ముందువరుసలో ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో నాయకులు ప్రజలకు మరింత చేరువ కావడమే కాక గతానికి భిన్నంగా ప్రజాసేవను విస్తరించారు. మొత్తం మీద ఈ ఏడాది ప్రజలకు, ఎమ్మెల్యేలకు మధ్య బంధం బలపడడంలో కీలక అడుగు పడిందనే చెప్పాలి.


This post was last modified on January 2, 2026 11:19 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

39 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

49 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

1 hour ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

1 hour ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago