సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో సామాన్యులనే కాదు, చదువుకున్నవారినీ నిలువునా ముంచేస్తున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతితో ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.23 కోట్లను దోచుకున్నారు. రిటైర్డ్ బ్యాంకర్కు పది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వీడియో కాల్ వచ్చింది. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులమని పరిచయం చేసుకున్న వారు, ఆధార్ కార్డు ద్వారా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని, తైవాన్కు డ్రగ్స్ పార్సెల్స్ పంపిన కేసులో ఆయన పేరు ఉందని బెదిరించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ భయాందోళనలకు గురిచేశారు.
నిజమైన అధికారుల్లా మాట్లాడిన నేరగాళ్లు, బాధితుడిని ఇంట్లోని ఒక గదిలోనే ఉండాలని, ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని ఆదేశిస్తూ ‘డిజిటల్ అరెస్ట్’ చేశారు. స్కైప్ ద్వారా 24 గంటల పాటు వీడియో పర్యవేక్షణలో ఉంచారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, షేర్లు, ఆస్తుల వివరాలను బెదిరింపుల ద్వారా తెలుసుకున్నారు. వీడియో కాల్లోనే ఇంటి తనిఖీ చేస్తున్నట్లు నటించి, బీరువాలో ఉన్న షేర్ మార్కెట్ పత్రాలను కూడా చూపించమన్నారు. భయంతో ఉన్న బాధితుడు, తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొదుపు మొత్తాన్ని మూడు విడతలుగా నేరగాళ్లు సూచించిన ఖాతాలకు మొత్తం రూ.1.23 కోట్లు బదిలీ చేశారు. అనంతరం నేరగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, సీఐ దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపారు, ‘డిజిటల్ అరెస్ట్’ అనే చట్టపరమైన విధానం దేశంలో ఎక్కడా లేదని, పోలీసులు, సీబీఐ, ఈడీ అధికారులు ఎప్పుడూ వీడియో కాల్ల ద్వారా బెదిరింపులు చేయరని స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, 1930కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
This post was last modified on January 2, 2026 10:50 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…