Trends

ఏపీ: డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్లు కొట్టేశారు..

సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో సామాన్యులనే కాదు, చదువుకున్నవారినీ నిలువునా ముంచేస్తున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతితో ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.23 కోట్లను దోచుకున్నారు. రిటైర్డ్ బ్యాంకర్‌కు పది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వీడియో కాల్ వచ్చింది. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులమని పరిచయం చేసుకున్న వారు, ఆధార్ కార్డు ద్వారా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని, తైవాన్‌కు డ్రగ్స్ పార్సెల్స్ పంపిన కేసులో ఆయన పేరు ఉందని బెదిరించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ భయాందోళనలకు గురిచేశారు.

నిజమైన అధికారుల్లా మాట్లాడిన నేరగాళ్లు, బాధితుడిని ఇంట్లోని ఒక గదిలోనే ఉండాలని, ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని ఆదేశిస్తూ ‘డిజిటల్ అరెస్ట్’ చేశారు. స్కైప్ ద్వారా 24 గంటల పాటు వీడియో పర్యవేక్షణలో ఉంచారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, షేర్లు, ఆస్తుల వివరాలను బెదిరింపుల ద్వారా తెలుసుకున్నారు. వీడియో కాల్‌లోనే ఇంటి తనిఖీ చేస్తున్నట్లు నటించి, బీరువాలో ఉన్న షేర్ మార్కెట్ పత్రాలను కూడా చూపించమన్నారు. భయంతో ఉన్న బాధితుడు, తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొదుపు మొత్తాన్ని మూడు విడతలుగా నేరగాళ్లు సూచించిన ఖాతాలకు మొత్తం రూ.1.23 కోట్లు బదిలీ చేశారు. అనంతరం నేరగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సీఐ దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపారు, ‘డిజిటల్ అరెస్ట్’ అనే చట్టపరమైన విధానం దేశంలో ఎక్కడా లేదని, పోలీసులు, సీబీఐ, ఈడీ అధికారులు ఎప్పుడూ వీడియో కాల్‌ల ద్వారా బెదిరింపులు చేయరని స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, 1930కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.

This post was last modified on January 2, 2026 10:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

25 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

39 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago