జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్ మీద పాలస్తీనా జెండా స్టిక్కర్ పెట్టుకొని బ్యాటింగ్ కు రావడం కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ‘జమ్మూ కాశ్మీర్ 11’ (JK11) – ‘జమ్మూ ట్రైల్ బ్లేజర్స్’ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫర్హాన్ భట్ అనే ఆ ఆటగాడు పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ధరించి ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించి, పోలీసులు వెంటనే ఆ క్రికెటర్ కు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 173(3) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు అతను ఆ జెండా ఎందుకు పెట్టుకున్నాడు? అతని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
కేవలం ఆ ప్లేయర్ నే కాకుండా, ఈ టోర్నమెంట్ నిర్వాహకుడు జాహిద్ భట్ ను కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ లీగ్ నిర్వహించడానికి సరైన అనుమతులు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) వెంటనే స్పందించింది.
ఈ లీగ్ కు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఆటగాడు తమ అసోసియేషన్ కు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేసింది. అనవసరంగా తమ పేరును ఇందులో లాగొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on January 2, 2026 5:33 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…