జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్ మీద పాలస్తీనా జెండా స్టిక్కర్ పెట్టుకొని బ్యాటింగ్ కు రావడం కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ‘జమ్మూ కాశ్మీర్ 11’ (JK11) – ‘జమ్మూ ట్రైల్ బ్లేజర్స్’ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫర్హాన్ భట్ అనే ఆ ఆటగాడు పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ధరించి ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించి, పోలీసులు వెంటనే ఆ క్రికెటర్ కు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 173(3) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు అతను ఆ జెండా ఎందుకు పెట్టుకున్నాడు? అతని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
కేవలం ఆ ప్లేయర్ నే కాకుండా, ఈ టోర్నమెంట్ నిర్వాహకుడు జాహిద్ భట్ ను కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ లీగ్ నిర్వహించడానికి సరైన అనుమతులు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) వెంటనే స్పందించింది.
ఈ లీగ్ కు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఆటగాడు తమ అసోసియేషన్ కు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేసింది. అనవసరంగా తమ పేరును ఇందులో లాగొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on January 2, 2026 5:33 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…