జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్ మీద పాలస్తీనా జెండా స్టిక్కర్ పెట్టుకొని బ్యాటింగ్ కు రావడం కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ‘జమ్మూ కాశ్మీర్ 11’ (JK11) – ‘జమ్మూ ట్రైల్ బ్లేజర్స్’ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫర్హాన్ భట్ అనే ఆ ఆటగాడు పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ధరించి ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించి, పోలీసులు వెంటనే ఆ క్రికెటర్ కు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 173(3) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు అతను ఆ జెండా ఎందుకు పెట్టుకున్నాడు? అతని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
కేవలం ఆ ప్లేయర్ నే కాకుండా, ఈ టోర్నమెంట్ నిర్వాహకుడు జాహిద్ భట్ ను కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ లీగ్ నిర్వహించడానికి సరైన అనుమతులు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) వెంటనే స్పందించింది.
ఈ లీగ్ కు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఆటగాడు తమ అసోసియేషన్ కు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేసింది. అనవసరంగా తమ పేరును ఇందులో లాగొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on January 2, 2026 5:33 pm
వరుణ్ తేజ్ గత సినిమాల ఓపెనింగ్స్ ఒకసారి తవ్వి తీస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకు చాలా చోట్ల ఫుల్స్…
న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…
సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే…
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…