Trends

కన్న వాళ్ళే పిల్లల ఉసురు తీస్తున్నారు.. అంత ఘోరమా…?

కన్నవారే కసాయిలా మారి తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. ఒక చోట తల్లి పిల్లలకు విషం పెట్టి తనూ ప్రాణాలు తీసుకుంటే, మరోచోట తండ్రి పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా మానవత్వం ఎక్కడ మాయమైందనే ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకు వస్తుంది.

పసిప్రాణాల భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఎవరు ఇచ్చారు? జీవితం కంటే తమ బాధలే పెద్దవిగా భావించి, చిన్నారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ చర్యలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

కొత్త సంవత్సరం వేళ తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రెండు ఘటనలు ఈ విషాదానికి నిదర్శనంగా నిలిచాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో భర్త మృతితో తీవ్ర మానసిక వేదనలో ఉన్న ఓ తల్లి, అన్నంలో పురుగుల మందు కలిపి తన ఇద్దరు పిల్లలకు తినిపించి తానూ ఆత్మహత్య చేసుకుంది. తల్లి, కుమార్తె మృతి చెందగా, కుమారుడు విషమ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరో ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో జరిగింది. భార్య మృతితో కుంగిపోయిన ఓ తండ్రి, తన ముగ్గురు చిన్నారులకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించి, వారు చనిపోయిన తర్వాత తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పదేళ్ల లోపు ఉన్న ఆ ముగ్గురు పసికందులు తమ తల్లిదండ్రుల బాధలకు బలయ్యారు.

ఇలాంటి ఘటనలను మానసిక వైజ్ఞానికంగా ‘అల్ట్రూస్టిక్ ఫిలిసైడ్’గా పేర్కొంటారు. భవిష్యత్తులో పిల్లలు కష్టపడతారనే భ్రమలో, వారిని ‘రక్షించాలి’ అన్న తప్పుడు ఆలోచనతో తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలకు వస్తారని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్, సైకోసిస్, బైపోలార్ డిసార్డర్ వంటి మానసిక సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, కుటుంబ కలహాలు, ఒంటరితనం, వ్యసనాలు ఈ దారుణాలకు దారి తీస్తున్నాయి.

అయితే ఏ పరిస్థితిలోనూ పిల్లల ప్రాణాలు తీసుకోవడం సమర్థనీయం కాదని, మానసిక సమస్యలపై అవగాహన పెంచి, అవసరమైనప్పుడు సహాయం తీసుకునే వ్యవస్థ బలపడితే ఇలాంటి విషాదాలను అడ్డుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

This post was last modified on January 1, 2026 8:36 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Parents kids

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

25 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

39 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago