కేవలం ఆరు వందల రూపాయలు.. అతనిని ఏడాది పాటు జైలుకి పంపింది. ఆదాయపు పన్ను రిఫండ్ ప్రాసెస్ చేయడానికి రూ.600 లంచం తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగికి పట్నా హైకోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసు 2011లో వెలుగులోకి వచ్చింది.
పన్ను రిఫండ్ కోసం కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ‘ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్’ రూ.600 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదుతో సీబీఐ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనిని కోర్టు కీలక ఆధారంగా పరిగణించింది. రెండు రోజుల కిందట తీర్పును వెలువరించింది.
ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలు, కార్యాలయంలోని సిబ్బంది వాంగ్మూలాలు సహా మొత్తం 12 మంది సాక్షుల ఆధారాలతో నేరం నిరూపితమైంది. సీబీఐ అధికారుల వాంగ్మూలం కూడా విచారణలో నిలకడగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగిలిన జైలు శిక్షను అనుభవించేందుకు నిందితుడు వెంటనే లొంగిపోవాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on December 31, 2025 4:35 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…