కేవలం ఆరు వందల రూపాయలు.. అతనిని ఏడాది పాటు జైలుకి పంపింది. ఆదాయపు పన్ను రిఫండ్ ప్రాసెస్ చేయడానికి రూ.600 లంచం తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగికి పట్నా హైకోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసు 2011లో వెలుగులోకి వచ్చింది.
పన్ను రిఫండ్ కోసం కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ‘ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్’ రూ.600 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదుతో సీబీఐ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనిని కోర్టు కీలక ఆధారంగా పరిగణించింది. రెండు రోజుల కిందట తీర్పును వెలువరించింది.
ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలు, కార్యాలయంలోని సిబ్బంది వాంగ్మూలాలు సహా మొత్తం 12 మంది సాక్షుల ఆధారాలతో నేరం నిరూపితమైంది. సీబీఐ అధికారుల వాంగ్మూలం కూడా విచారణలో నిలకడగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగిలిన జైలు శిక్షను అనుభవించేందుకు నిందితుడు వెంటనే లొంగిపోవాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on December 31, 2025 4:35 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…