కేవలం ఆరు వందల రూపాయలు.. అతనిని ఏడాది పాటు జైలుకి పంపింది. ఆదాయపు పన్ను రిఫండ్ ప్రాసెస్ చేయడానికి రూ.600 లంచం తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగికి పట్నా హైకోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసు 2011లో వెలుగులోకి వచ్చింది.
పన్ను రిఫండ్ కోసం కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ‘ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్’ రూ.600 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదుతో సీబీఐ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనిని కోర్టు కీలక ఆధారంగా పరిగణించింది. రెండు రోజుల కిందట తీర్పును వెలువరించింది.
ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలు, కార్యాలయంలోని సిబ్బంది వాంగ్మూలాలు సహా మొత్తం 12 మంది సాక్షుల ఆధారాలతో నేరం నిరూపితమైంది. సీబీఐ అధికారుల వాంగ్మూలం కూడా విచారణలో నిలకడగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగిలిన జైలు శిక్షను అనుభవించేందుకు నిందితుడు వెంటనే లొంగిపోవాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on December 31, 2025 4:35 pm
కొత్త సంవత్సరం 2026 భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు.. 72…
లెజెండరీ నటుడు సాయికుమార్ వారసత్వాన్నందుకుంటూ సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆది సాయికుమార్కు కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ…
ప్రభాస్తో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరూ తన గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు.. అతను కడుపు పగిలిపోయేలా ఎలా ఫుడ్డు…
గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. గిరిజన…
తెలంగాణ ఉద్యోగులకు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందే భారీ కానుకను ప్రకటించింది. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురు…
ఎన్నో జ్ఞాపకాలు మిగులుస్తూ, ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తూ 2025 సెలవు తీసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ కు సంబంధించి ఈసారి ఉగాది…