నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ.. 2025కు వీడ్కోలు చెబుతూ.. నిర్వహించుకునే కార్యక్రమాల్లో మందు బాబులు రెచ్చిపోవడం ఖాయం. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మందు పార్టీలకు నూతన సంవత్సరం సందర్భంగా పెట్టింది పేరు. దీంతో అనేక బార్లు, రెస్టారెంట్లు.. ఇప్పటికే మందుబాబులకు ఫుల్ బాటిళ్లపై రాయితీలు కూడా ప్రకటించాయి. అయితే.. నాణేనికి ఇది ఒకవైపే.
మరోవైపు.. మందు తాగి చిందులు వేస్తే ఊరుకునేది లేదని.. బుధవారం పొద్దు పొద్దున్నే హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి 11-1 మధ్య నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక తనిఖీలు ఉంటాయని చెప్పారు. మందు తాగి వాహనం నడిపితే.. భారీ జరిమానాలు విధించడంతో పాటు.. సదరు వాహనాలను కూడా జప్తు చేస్తామన్నారు. అంతేకాదు.. జైలుకు కూడా పంపిస్తామని హెచ్చరించారు. ఈ ప్రకటన నగరంలో తీవ్ర సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో హుటాహుటిన బార్ల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బార్లలో మందు తాగిన వారిని ఇంటికి ఉచితంగా చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని .. ప్రత్యేకంగా కార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విశేషం. అయితే..ఈ కార్లు ఎంపిక చేసిన ప్రాంతాల మీదుగానే నడవనున్నాయి. అయినప్పటికీ.. ఆయా దారుల్లో మందుబాబులు ప్రయాణించేందుకు వెసులు బాటు కలగనుంది.
మరోవైపు.. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ కూడా కీలక ప్రకటన చేసింది. మందు తాగిన వారు.. తమకు ఫోన్ చేస్తే(నెంబరు 8977009804) వారిని సురక్షితంగా ఇళ్ల వద్దకు తీసుకువెళ్తామని పేర్కొంది. దీనికి రూపాయి కూడా చార్జ్ చేయబోమని వెల్లడించింది. అయితే.. ఈ సేవలు కేవలం రాత్రి 11 నుంచి 1గంట మధ్య మాత్రమే ఉంటాయని పేర్కొంది. క్యాబ్లు, ఆటోలు, ఈవీ బైక్లు కలిపి మొత్తం 500 వాహనాలు మందుబాబులకు సేవలు అందించనున్నాయి. అయితే.. వీరి ప్రకటన వెనుక బార్ల యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తోంది.
This post was last modified on December 31, 2025 2:57 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…