తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఫస్ట్ టైమ్ ఓ హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి స్థానిక కోర్టు ఉరి శిక్ష విధించింది. కాగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. అనేక నేరాలు జరిగాయి. అనేక హత్యలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక, మహిళలపై అత్యాచారం కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. కొన్ని కేసుల్లో నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారు. కానీ.. ఇప్పటి వరకు బలమైన ఇలాంటి నేరాల కేసుల్లో ఉరి లేదా మరణ శిక్ష ఇప్పటి వరకు ఎవరికీ పడలేదు. తొలిసారి ఓ మహిళ హత్య కేసులో కోర్టు దోషికి మరణ శిక్ష విధించడం గమనార్హం.
ఏం జరిగింది?
2011, జూలై 18వ తేదీన సనత్నగర్లో ఓ మహిళ దారుణహత్యకు గురయ్యారు. ఇనుప సామాన్లు తయారు చేసే వ్యక్తి.. ఆమెపై బలాత్కారం చేయడంతో .. ఆమె ప్రతిఘటించారు. ఈ క్రమంలో చేతిలోని సుత్తితో ఆమె తలను ఛిద్రం చేసిన నిందితుడు మహిళను చంపేశాడు. ఈ ఘటన అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది.
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేవలం రోజుల వ్యవధిలోనే నిందితుడు(ఇప్పుడు దోషి)ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. తాజాగా నేరం నిరూపితం కావడంతో మేడ్చల్ – మల్కాజ్గిరి మూడో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించి.. ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఇలా.. ఒక దోషికి మరణ శిక్ష విధించడం తెలంగాణలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.
ఎవరతను?
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన కరణ్ సింగ్.. ఉపాధి నిమిత్తం రెండు దశాబ్దాల కిందటే హైదరాబాద్కు వచ్చాడు. ఇనుప సామాన్లు తయారు చేసి.. వీధుల్లో విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలోనే 2011లో ఓ ఇంటికి వెళ్లిన సింగ్.. ఆ ఇంటి మహిళపై కన్నేసి.. బలత్కారం చేయబోయాడు.
ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడు. ఇక, తాజాగా కోర్టు మరణ శిక్ష విధించినా.. అది ఆమోదం పొంది.. అమలవుతుందా? అనేది సందేహం. ఎందుకంటే.. స్థానిక కోర్టులు విధించే తీవ్ర శిక్షలను హైకోర్టు సమీక్షించి.. తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇది జరగడానికి సుదీర్ఘకాలం సమయం పడుతుంది.
This post was last modified on December 29, 2025 10:48 pm
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…