అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ 1బి వీసా ‘లాటరీ విధానానికి’ ట్రంప్ ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై అదృష్టం ఉంటే వీసా వస్తుంది అనుకోవడం కుదరదు. దీని స్థానంలో అత్యధిక నైపుణ్యం, ఎక్కువ జీతం ఉన్నవారికే రెడ్ కార్పెట్ పరిచే కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
ఇన్నాళ్లు ఉన్న లాటరీ సిస్టమ్ వల్ల తక్కువ జీతానికి పని చేసే విదేశీయులను కంపెనీలు రప్పించుకుంటున్నాయని, దీనివల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అందుకే ఈ పాత పద్ధతిని రద్దు చేసి, కేవలం ‘హై పెయిడ్’, ‘హై స్కిల్డ్’ వర్కర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అమెరికన్ వర్కర్ల వేతనాలు, పని పరిస్థితులను కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఇది మాత్రమే కాదు, వీసా సంపాదించడం అనేది ఇకపై చాలా ఖరీదైన వ్యవహారం కాబోతోంది. కొత్త హెచ్ 1బి అప్లికేషన్లకు ఏటా ఏకంగా 100,000 డాలర్ల ఫీజు కట్టాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి కూడా సమర్థించారు. ఇది అమెజాన్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీల నియామకాలపై భారీ ప్రభావం చూపనుంది.
ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. అంటే రాబోయే సీజన్ నుంచి ఈ రూల్స్ వర్తిస్తాయి. ఇకపై వీసా రావాలంటే ‘వెయిటెడ్ సెలెక్షన్ ప్రాసెస్’ ఉంటుంది. అంటే మీ జీతం ఎంత ఎక్కువ ఉంటే, వీసా వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ అన్నమాట.
మొత్తానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీసా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఒకపక్క 1 మిలియన్ డాలర్లతో ‘గోల్డ్ కార్డ్’ ఇస్తూ సంపన్నులకు పౌరసత్వానికి దారి చూపిస్తోంది. మరోపక్క సాధారణ ఉద్యోగులకు లాటరీని రద్దు చేసి కఠిన ఆంక్షలు పెడుతోంది. అమెరికా కల సాకారం చేసుకోవాలంటే ఇకపై టాలెంట్ తో పాటు ఆఫర్ లెటర్ లో భారీ ప్యాకేజీ ఉండాల్సిందే.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…