నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక.. గత రెండు దశాబ్దాల్లో ఎంతోమంది కొత్త పంపిణీదారులు వచ్చారు. కొన్నాళ్లు దూకుడు చూపించి, తర్వాత కనుమరుగైపోయారు. ఐతే దిల్ రాజు ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు.
మైత్రీ సంస్థ దిల్ రాజుతో విభేదించే, కొన్నేళ్ల ముందు సొంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకుందని ఫిలిం నగర్ టాక్. కానీ ఆ సంస్థ పంపిణీ వ్యవహారం సాఫీగా ఏమీ సాగట్లేదు. కాగా ఇటీవల అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థ నైజాం డిస్ట్రిబ్యూషన్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్గా ధీరజ్ మొగిలినేని సైతం రంగంలోకి దిగాడు. ఇంకా కొందరు ఈ బాటలోనే సాగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక రకంగా దిల్ రాజుకు సవాలు విసరడమే.
ఐతే ఈ ఛాలెంజ్కు దిల్ రాజు వెంటనే స్పందించాడు. తాను కొనాలనుకున్న సినిమాలు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లినా.. ఆయనేమీ కంగారు పడిపోలేదు. అగ్రెసివ్గా కొత్త కొనుగోళ్లు మొదలు పెట్టారు. యశ్ మూవీ ‘టాక్సిక్’ తెలుగు హక్కులు ఏకంగా రూ.120 కోట్లు పెట్టి కొనడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్కు కూడా కలిపి ఆయన హోల్ సేల్గా కొనేశారు. ఇందుకోసం రూ.6 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ‘ఓం శాంతి శాంతి శాంతి:’తో షాక్ తిన్నప్పటికీ తరుణ్ సినిమా మీద ఇంత పెట్టుబడి పెట్టడం అంటే సాహసమే.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని నమ్మి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు రాజు. దీంతో పాటే మరో కొత్త సినిమా హక్కులను కూడా రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
శర్వానంద్ కొత్త చిత్రం ‘బైకర్’ తెలుగు రాష్ట్రాల రైట్స్ను ఆయన రూ.20 కోట్లకు కొన్నారట. ఈ సినిమా స్థాయికి ఇది ఫ్యాన్సీ రేటే. కానీ శర్వానంద్ వరుస ఫ్లాపుల్లో ఉండగా ‘నారీ నారీ నడుమ మురారి’ని కొని మంచి లాభాలందుకున్న రాజు.. ‘బైకర్’ అంతకుమించి సక్సెస్ కాగలదని నమ్మి ఆ సినిమా మీద పెద్ద పెట్టుబడి పెట్టేశారు. ఒక రకంగా నైజాంకు తనకు చెక్ పెట్టాలని చూస్తున్న వారికి ఇది రాజు సమాధానంగా కనిపిస్తోంది.
This post was last modified on February 19, 2026 4:58 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…