ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు.. స్టేజ్ మీద శంకర్తో సినిమా చేయాలన్న తన ఆసక్తిని బయటపెట్టుకున్నాడు. అయినా చిరుతో సినిమా చేయడానికి శంకర్కు వీలు పడలేదు. తమిళ అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేస్తూ పోయాడు శంకర్.
కానీ ఇప్పుడు శంకర్తో సినిమా చేయాలంటే స్టార్ హీరోలు, నిర్మాతలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఐ, రోబో-2లతో అంచనాలను అందుకోలేకపోయిన ఆయన.. ఇండియన్-2, గేమ్ చేంజర్ చిత్రాలతో డిజాస్టర్లు డెలివర్ చేసి తన డిమాండును బాగా తగ్గిపోయింది. ఇప్పుడు శంకరే హీరోలు, నిర్మాతల వెంటపడాల్సిన పరిస్థితి వచ్చింది.
‘గేమ్ చేంజర్’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఆయన.. ‘వేల్పారి’ అనే బుక్ ఆధారంగా ఒక భారీ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కొందరు నిర్మాతలను సంప్రదించి నిరాశపడ్డ ఆయన.. బాలీవుడ్కు చెందిన పెన్ మూవీస్, అలాగే కోలీవుడ్లో ఆర్ టేక్ స్టూడియోస్ అనే మరో సంస్థతో చర్చలు జరుపుతున్నాడు.
మల్టీస్టారర్ అయిన ‘వేల్పారి’లో ముఖ్య పాత్రల కోసం విక్రమ్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్లను శంకర్ సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకో పేరు వచ్చింది. విలక్షణ నటుడు, పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న ధనుష్తో ఓ కీలక పాత్ర కోసం ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట శంకర్. ఇటీవల ధనుష్ కొత్త సినిమా ఓపెనింగ్కు కూడా శంకర్ రావడంతో ఈ ప్రచారం ఊపందుకుంది.
ధనుష్ ఏళ్ల తరబడి ఒక ప్రాజెక్టుకు అంకితం అయ్యే రకం కాదు. చకచకా సినిమాలు చేసుకుపోతుంటాడు. కానీ శంకర్తో సినిమా అంటే చాలా టైం పడుతుంది. ఏళ్లకు ఏళ్లు సాగుతూ ఉంటుంది. మరి ఈ ఇద్దరికీ ఎలా సింక్ కుదురుతుందో చూడాలి. ‘వేల్పారి’లో ధనుష్కు ఆఫర్ చేస్తున్నది హీరో పాత్ర కాదు కానీ.. చాలా కీలకమైన క్యారెక్టరే అని సమాచారం.
‘వేల్పారి’ ఒక తమిళ యోధుడి కథ. ‘పొన్నియన్ సెల్వన్’ తరహాలోనే ఈ కథకూ పెద్ద హిస్టరీ ఉంది. మరి ఈ కథ అయినా శంకర్ కెరీర్ను మళ్లీ పట్టాలెక్కిస్తుందేమో చూడాలి.
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…