Trends

వింత వ్యాధికి అసలు కారణం బయటపడిందా ?

ఏలూరులో కలకలం రేపుతున్న వింతవ్యాధికి అసలు కారణాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. క్రిమిసంహార మందుల్లో ఉండే ఆర్గానో క్లోరిన్ కారణంగానే మనుషుల మెదడుపై తీవ్ర ప్రబావం చూపుతున్నట్లు గుర్తించారు. పంటల్లో వాడే క్రిమిసంహారక మందులు, దోమలు, బొద్దింకలు, ఈగలు తదితర క్రిమిసంహారకాలకు వాడే రశాయనాలు తాగునీటిలో విపరీతంగా కలిసిపోయినట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. నీటిలో ఉండాల్సినదానికన్నా కొన్ని వేల రెట్లు క్రిమిసంహారకాలు చేరిపోయినట్లు నీటి శాంపుల్సు పరీక్షల్లో తేలింది.

వింతవ్యాధికి కారణాలపై ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్, సీసీఎంబి లాంటి ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్ధల్లోని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరి అద్యయనంలో తాగునీటిలో సీసం, నికెల్ లాంటి రశాయనాలతో పాటు ఆర్గానో క్లోరిన్ అనే ప్రమాదకరమైన రశాయనం కూడా కలిసినట్లు ప్రదామిక పరీక్షల్లో బయటపడింది.

ఇదే సమయంలో జాతీయ పోషకాహార సంస్ధ (ఎన్ఐఎన్) నిపుణులు కూడా ఏలూరులోనే క్యాంపు వేసి ప్రజలు వాడే కూరగాయలు, పాలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, నూనె తదితరాల శాంపిళ్ళను సేకరించి పరిశొధనలు చేస్తోంది. క్రిమిసంహారకాలను పరిమితికి మించి వాడినపుడు బయటపడే దుష్ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని వీరు అధ్యయనం చేస్తున్నారు. కూరగాయాలు, ఆకుకూరల పంటలపై క్రిమిసంహారకాలు విపరీతంగా వాడుతున్నారనే విషయాన్ని ఎన్ఐఎన్ నిపుణులు గ్రహించారు.

పరిమితికిమించిన రశాయనాలు మనుషుల శరీరాల్లోకి చేరిపోవటం వల్ల అదంతా బ్రైన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని శాస్త్రజ్ఞలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వీటిని వాడుతున్నది ఇపుడు అనారోగ్యానికి గురైన బాధితులు మాత్రమే కాదు. ఏలూరు నగరంలో ఉండే సుమారు 4.5 లక్షల మందీ దాదాపు ఇవే వాడుతున్నారు. మరి వాళ్ళందరిపైనా ఇటువంటి ప్రభావాలు ఎందుకు కనబడటం లేదు ? అనే విషయంపైన కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఏదేమైనా తొందరలోనే వింతవ్యాధి మూలకారణాలు బయటపడతాయనే అనుకుంటున్నారు.

This post was last modified on December 10, 2020 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago