Trends

ఏపీలో ఘోరం, లోయలో పడిన బస్సు.. 9 మంది దుర్మరణం

ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజు గారి మెట్ట మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ట్రావెల్ బస్సుగా గుర్తించారు. భద్రాచలం వెళ్లి అన్నవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు నగరం మిట్టూరు శ్రీ విజ్ఞేశ్వర ట్రావెల్స్ కు చెందినగా గుర్తించారు. ఈనెల ఆరవ తేదీన 38 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఏడు రోజులు పాటు పుణ్యక్షేత్రాలు సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు నగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాసులతో ఈ బస్సు బయలుదేరింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల హాహాకారాలతో మార్మోగింది. పోలీసులు అక్కడికి చేరుకుని స్థానిక సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

ఘటనాస్థలికి మూడు అంబులెన్సులు, ఐదు పోలీసు వాహనాలు చేరుకున్నాయి. ప్రమాదంపై కలెక్టర్ ఎస్పీతో.. మంత్రి సంధ్యారాణి, మంత్రి అనిత మాట్లాడారు. గాయపడిన వారిని చింతూరు హాస్పటల్ కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించాలని మంత్రులు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరగడంతో చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్డు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

This post was last modified on December 12, 2025 9:46 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అనంతబాబు అరెస్టు… తర్వాతేంటి?

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…

18 minutes ago

సింగపూర్ క్లాసులు.. ఇక్కడ పాలన

రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియ‌నుంది. మూడు రోజుల పర్యటనలో…

22 minutes ago

రజనీ షారుఖ్.. రీవేంజ్ కాదు కానీ…

సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…

1 hour ago

బాలయ్య దర్శకులకు అసలైన సవాల్

​నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…

2 hours ago

విజయ్ నియోజకవర్గంలో రాత్రి 1 వరకు ఓటింగ్…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వాస్త‌వానికి గ‌తంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగేవి. తాజాగా…

2 hours ago

ప్ర‌శంస‌లేనా.. ఛాన్సులూ ఇస్తారా?

80, 90 ద‌శ‌కాల్లో వైభ‌వం చూసిన క‌థానాయ‌కుల్లో రాజ‌శేఖ‌ర్ ఒక‌రు. స్వ‌త‌హాగా త‌మిళుడైన‌ప్ప‌టికీ.. తెలుగులోనే ఆయ‌న పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…

2 hours ago