ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజు గారి మెట్ట మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ట్రావెల్ బస్సుగా గుర్తించారు. భద్రాచలం వెళ్లి అన్నవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు నగరం మిట్టూరు శ్రీ విజ్ఞేశ్వర ట్రావెల్స్ కు చెందినగా గుర్తించారు. ఈనెల ఆరవ తేదీన 38 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఏడు రోజులు పాటు పుణ్యక్షేత్రాలు సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు నగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాసులతో ఈ బస్సు బయలుదేరింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల హాహాకారాలతో మార్మోగింది. పోలీసులు అక్కడికి చేరుకుని స్థానిక సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనాస్థలికి మూడు అంబులెన్సులు, ఐదు పోలీసు వాహనాలు చేరుకున్నాయి. ప్రమాదంపై కలెక్టర్ ఎస్పీతో.. మంత్రి సంధ్యారాణి, మంత్రి అనిత మాట్లాడారు. గాయపడిన వారిని చింతూరు హాస్పటల్ కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించాలని మంత్రులు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరగడంతో చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్డు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
This post was last modified on December 12, 2025 9:46 am
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…
నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…
మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…