Trends

ఏపీలో ఘోరం, లోయలో పడిన బస్సు.. 9 మంది దుర్మరణం

ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజు గారి మెట్ట మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ట్రావెల్ బస్సుగా గుర్తించారు. భద్రాచలం వెళ్లి అన్నవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు నగరం మిట్టూరు శ్రీ విజ్ఞేశ్వర ట్రావెల్స్ కు చెందినగా గుర్తించారు. ఈనెల ఆరవ తేదీన 38 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఏడు రోజులు పాటు పుణ్యక్షేత్రాలు సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు నగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాసులతో ఈ బస్సు బయలుదేరింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల హాహాకారాలతో మార్మోగింది. పోలీసులు అక్కడికి చేరుకుని స్థానిక సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

ఘటనాస్థలికి మూడు అంబులెన్సులు, ఐదు పోలీసు వాహనాలు చేరుకున్నాయి. ప్రమాదంపై కలెక్టర్ ఎస్పీతో.. మంత్రి సంధ్యారాణి, మంత్రి అనిత మాట్లాడారు. గాయపడిన వారిని చింతూరు హాస్పటల్ కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించాలని మంత్రులు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరగడంతో చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్డు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

This post was last modified on December 12, 2025 9:46 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

1 hour ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

2 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

3 hours ago

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

3 hours ago

వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు

దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…

3 hours ago

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…

4 hours ago