మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్స్ మెస్సీని ఎంతో గౌరవంగా కలిస్తే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ చేసిన పని మాత్రం విమర్శల పాలవుతోంది. ఆమె ప్రవర్తించిన తీరు చూసి ఫుట్బాల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
వేదికపై మెస్సీ పక్కన నిల్చొని ఫోటోలు దిగేటప్పుడు అమృత నోట్లో చూయింగ్ గమ్ నములుతూ చాలా క్యాజువల్ గా కనిపించారు. ప్రపంచం మొత్తం ఆరాధించే ఒక స్టార్ పక్కన ఉండి, కనీస మర్యాద పాటించకుండా ఆమె ప్రవర్తించిన తీరు బాలేదని అంటున్నారు. అతిథికి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి, ఇదేం ఆటిట్యూడ్ అని నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు.
అంతటితో ఆగకుండా, సెల్ఫీ కోసం ఆమె చేసిన హడావిడి కూడా ట్రోల్స్ కు కారణమైంది. పక్కన ఉన్న అర్జెంటీనా ప్లేయర్ రోడ్రిగో డి పాల్ ను పక్కకు జరగమని సైగ చేసి మరీ, మెస్సీకి ఆనుకుని ఫోటోలు దిగడానికి ఆమె ప్రయత్నించారు. ఆ సమయంలో మెస్సీ కూడా కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలవ్వడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ లో మెస్సీ పర్యటన ఎంతో పద్ధతిగా జరిగితే, ముంబైలో మాత్రం ఈ వీవీఐపీ కల్చర్ వల్ల పరువు పోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక రాష్ట్ర సీఎం భార్య హోదాలో ఉండి, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఇలా ప్రవర్తించడం మన సంస్కృతికే మచ్చ అని ఘాటుగా విమర్శిస్తున్నారు. కనీసం స్టేజ్ మీద ఉన్నప్పుడు చూయింగ్ గమ్ వేసుకోకూడదు అనే బేసిక్ మ్యానర్స్ కూడా లేవా అని నిలదీస్తున్నారు. మెస్సీ రాకతో దేశం మొత్తం సంబరపడితే, ఈ మూమెంట్ కాంట్రవర్సిగా మారింది. సెల్ఫీల మోజులో పడి విచక్షణ కోల్పోతే ఇలాగే ఉంటుందని మరికొందరు అంటున్నారు.
This post was last modified on December 15, 2025 4:00 pm
ప్రభాస్ ఫౌజీ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ఆ…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర…
తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…
బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…
గుంటూరులోని తూర్పు, పడమర నియోజకవర్గాల్లో వైసీపీ తన ప్రభావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్నరేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బతిందన్న…
ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…