Political News

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం కారణంగా రెండు నెలల క్రితమే సెలవుపై వెళ్లిన డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను తాజాగా ఆ పదవి నుంచి పూర్తిగా తప్పించింది. ఆయన స్థానంలో ఓపీ సింగ్‌ను ఇన్‌ఛార్జ్ డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూరన్ కుమార్ ఆత్మహత్య తర్వాత ప్రతిపక్షాల నుంచి వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత అక్టోబర్ 7న 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పూరన్ కుమార్ తనను తాను కాల్చుకుని చనిపోయారు. ఘటనా స్థలంలో దొరికిన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో డీజీపీ కపూర్‌తో సహా పలువురు సీనియర్ అధికారులు తనను కులం పేరుతో వివక్ష చూపారని, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. బహిరంగంగా అవమానాలకు గురిచేశారని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ఆరోపణలు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో అక్టోబర్ 14నే డీజీపీ కపూర్‌ను ప్రభుత్వం సెలవుపై పంపించింది. ఇప్పుడు తాజాగా ఆయనను డీజీపీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, హర్యానా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఒక డీజీపీ స్థాయి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం, ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.

పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ పి. కుమార్ డిమాండ్ మేరకే విచారణ వేగవంతమైంది. నిష్పక్షపాత విచారణ జరుపుతామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చండీగఢ్ పోలీసులు, ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే ఆమె పోస్ట్ మార్టంకు అంగీకరించారు. తన భర్త మరణానికి కారణమైన అధికారులను వదిలిపెట్టకూడదని ఆమె గట్టిగా కోరారు.

ప్రస్తుతానికి ఓపీ సింగ్‌కు డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన డిసెంబర్ 31న రిటైర్ కానుండటంతో, కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం యూపీఎస్సీకి ప్రతిపాదనలు పంపే యోచనలో ఉంది.

Satya

Recent Posts

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

3 minutes ago

గ్రేట్ డైరెక్టర్… సిల్లీ లాజిక్

గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…

1 hour ago

సుప్రీం చెప్పింది… మోడీ క‌దిలారు: దేశ‌వ్యాప్తంగా దాడులు!

సుప్రీంకోర్టు హెచ్చ‌రిక‌లు, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం క‌దిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…

2 hours ago

భూకంపంతో వణికిన వెనిజులా… మృతులు లక్షమంది!

వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్‌తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…

3 hours ago

ఇండియాలో పౌరసత్వానికి అసలైన ఆధారమేది?

విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్‌పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…

3 hours ago

అమరావతిలో సినీ సందడి… బాలయ్య సినిమాకి అల్లుడి క్లాప్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో…

3 hours ago