Trends

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్టి.రామస్వామి సైతం మోసపోయారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో, డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి రూ.57 లక్షలు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై గత నవంబర్‌లో చెన్నై సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

వీడియో కాల్ ద్వారా ఢిల్లీ పోలీసుల యూనిఫాంలో కనిపించిన మోసగాళ్లు, ఎఫ్‌ఐఆర్ కాపీలు చూపిస్తూ తీవ్రంగా బెదిరించినట్లు రామస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరుతో అక్రమ కేసులు నమోదయ్యాయని, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారమని నమ్మబలికారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆయన దశలవారీగా రూ.57 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత మరో రూ.2.43 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి, స్నేహితుల సూచన మేరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసుపై అధికారులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.

ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మోసాలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇదే తరహా మోసంలో దాదాపు రూ.11 కోట్లు కోల్పోయారు. చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని సైబర్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, ఆధార్ వంటి వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ మోసాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌కీ బాత్‌లో ప్రస్తావించగా, గత రెండేళ్లలో ఇలాంటి స్కామ్‌ల ద్వారా రూ.2,500 కోట్లకు పైగా దోచుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రజలు అప్రమత్తతే ఈ మోసాలకు ప్రధాన ఆయుధమని పోలీసులు సూచిస్తున్నారు.

This post was last modified on December 15, 2025 3:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

3 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

4 hours ago

స్లమ్ డాగ్ మేలుకుంటే బాగుండేది

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…

10 hours ago

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…

11 hours ago

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…

12 hours ago

అలాంటి మ్యాజిక్.. ఇంకోసారి సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…

13 hours ago