నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు. భైరవం అంచనాలు అందుకోలేకపోయినా మిరాయ్ సూపర్ హిట్ కావడం ఊరటనిచ్చింది. అలాని తనతో సోలో హీరోగా సినిమాలు తీసే నిర్మాతలు లేరని కాదు. కొత్త ప్రాజెక్టులు తెరకెక్కబోతున్నాయి. వాటిలో డేవిడ్ రెడ్డి ఒకటి. చరిత్రలో గుర్తింపు లేకుండా పోయిన ఒక స్వాతంత్ర సమరయోధుడి కథను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి తెరకెక్కించబోతున్నారు. అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చింది కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. ఫాన్స్ దీని కోసమే ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడో క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో రెండు ముఖ్యమైన క్యామియోలకు పెద్ద స్టార్ హీరోలు అవసరం కావడంతో ఆ మేరకు ఇద్దరిని సంప్రదించినట్టు తెలిసింది. మొదటి పేరు రామ్ చరణ్. పాత్ర నచ్చింది కానీ చేసేది లేనిది చెప్పలేదట. ఇప్పటిదాకా చరణ్ క్యామియో చేసింది ఆచార్యలో మాత్రమే. అది కూడా తండ్రి చిరంజీవి సినిమా కాబట్టి. మనోజ్ తో ఎంత స్నేహం ఉన్నా మార్కెట్ పరంగా చాలా క్యాలికులేషన్లు, అభిమానుల్లో అంచనాలు ఉంటాయి కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోలేడు. రెండో పేరు కోలీవుడ్ స్టార్ శింబు. దాదాపు ఓకే అన్నట్టు తెలిసింది.
మనోజ్ తో శింబుతో ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి ఇందులో కూడా ఆశ్చర్యం లేదు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఎపిక్ మూవీలో ఇంకా చాలా విశేషాలు ఉండబోతున్నాయట. ఏది ఏమైనా మంచు మనోజ్ కు మంచి టైం అయితే వచ్చింది. అన్నయ్య విష్ణు కన్నప్ప తర్వాత ఇంకే సినిమా కమిట్ కాలేదు కానీ మనోజ్ మాత్రం రెండు మూడు లైన్ లో పెడుతున్నాడు. 90 ఎంఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో అత్తరు సాయిబు ఫైనల్ నెరేషన్ జరగాల్సి ఉంది. వీటికన్నా చాలా ముందు మొదలుపెట్టిన వాట్ ది ఫిష్ ఏవో కారణాల వల్ల ఆపేశారు కానీ త్వరలోనే రీ స్టార్ట్ చేస్తారట. మనోజ్ ఇదే స్పీడ్ కొనసాగిస్తే మంచిది.
This post was last modified on December 15, 2025 5:13 pm
వరల్డ్ మ్యూజిక్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మైకేల్' ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆంటోనీ ఫుక్వా…
ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…
సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది,…
నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన…
ఇవాళ అనౌన్స్ చేసిన దురంధర్ 2 టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు పన్నెండు దాటుతుందా…
ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం.…