దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్ కూడా ఏపీ తెలంగాణలో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. థియేటర్లు తక్కువ అందుబాటులో ఉండటంతో బయ్యర్లు షాక్ అయ్యేలా మెయిన్ సెంటర్స్ లో టికెట్ ముక్క మిగల్లేదు. ఇక్కడే ఇలా ఉంటే ఉత్తరాదిలో పరిస్థితిని వివరించనక్కర్లేదు. ముంబైలో పదో రోజు అర్ధరాత్రి షోలు వేయడం ప్యూర్ మ్యాడ్ నెస్ అని చెప్పాలి. సోషల్ మీడియా సపోర్ట్ చాలా బలంగా ఉండటంతో వసూళ్లు అంతకంతా పెరుగుతున్నాయి తప్పించి తగ్గే సూచనలు కనిపించడం లేదు.
ప్రస్తుతం నాలుగు ఐదు కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతున్న దురంధర్ ఈజీగా వెయ్యి కోట్లను చేరుకుంటుందని బాలీవుడ్ హ్యాండిల్స్ కొన్ని అంచనా వేస్తున్నాయి. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే యానిమల్ అంత అరివీరభయంకరంగా ఆడితే తొమ్మిది వందల కోట్లు దాటగానే ఆగిపోయింది. ఫేక్ నెంబర్లు వద్దనుకున్న టి సిరీస్, సందీప్ రెడ్డి వంగాలు ఒరిజినల్ అంకెలకే కట్టుబడ్డారు. ఇప్పుడు దురంధర్ కు కూడా ఆ స్థాయి స్పందనే ఉంది కానీ టార్గెట్ 50 శాతం ఉంది కాబట్టి దాన్ని అందుకోవాలంటే ఇదే దూకుడు ఇంకో రెండు మూడు వారాలు కొనసాగించాల్సి ఉంటుంది.
అయినా సరే ఇది టఫ్ టాస్క్ అనే చెప్పాలి. రిలీజ్ కు ముందు సైలెంట్ కిల్లర్ గా వచ్చిన దురంధర్ రివ్యూల విషయంలో మీడియాని రెండుగా చీల్చేసింది. ముంబై వర్గాల్లో ఇది రోజుకో చర్చ పెడుతోంది. హిందీ న్యూస్ ఛానల్స్ డైలీ కనీసం ఒక గంట దీనికే కేటాయించి వారం రోజులు పండగ చేసుకున్నాయి. త్వరలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్న నిర్మాతలు దాన్నుంచి ఎంత రాబడతారనేది చూడాలి. గతంలో చావా కూడా ఇదే తరహాలో ఆలస్యంగా డబ్బింగ్ చేసుకుని ఆశించిన ఫలితం అందుకోలేదు. దురంధర్ ఎక్కువ లేట్ చేయకుండా వీలైనంత త్వరగా ప్రాంతీయ భాషల్లో రావడం అవసరం.
This post was last modified on December 15, 2025 4:52 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…