Trends

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఎయిర్ పోర్టుల్లో నరకం చూసిన వారికి సారీ చెబుతూ, పది వేల రూపాయల ట్రావెల్ వోచర్లు ఇస్తామని ప్రకటించింది. కస్టమర్స్ కోపాన్ని ఈ కూపన్లతో తగ్గించే ఈ ప్రయత్నంపై సోషల్ మీడియాలో రకారకరాల కామెంట్స్ వెలువడుతున్నాయి.

ఈ ఆఫర్ ప్రకారం, బాగా ఇబ్బంది పడ్డ ప్యాసింజర్లు ఈ పది వేల వోచర్‌ను వచ్చే ఏడాదిలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇది టికెట్ రీఫండ్ కు అదనం అని సంస్థ చెబుతోంది. అయితే ఇక్కడో మెలిక ఉంది. ‘తీవ్రంగా ప్రభావితమైన’ వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. అంటే ఎవరు అర్హులు, ఎవరు కాదు అనేది ఇండిగోనే డిసైడ్ చేస్తుందన్నమాట. ఇది మరో పెద్ద కాంట్రవర్సి అయ్యే అవకాశం ఉంది.

అసలు ప్రశ్న ఏంటంటే.. ఈ పది వేలు నిజంగా సరిపోతుందా? ఆ ప్రయాణం నమ్ముకుని మిస్ అయిన పెళ్లిళ్లు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, పరీక్షల విలువను ఈ వోచర్లు భర్తీ చేయగలవా? అర్జంట్‌గా వేరే ఫ్లైట్‌లో వెళ్లడానికి జనం తడిసి మోపెడయ్యేలా ఖర్చు చేశారు. ఆ మానసిక వేదన ముందు ఈ వోచర్లు కేవలం కంటితుడుపు చర్యలాగే కనిపిస్తున్నాయి.

ఈ గందరగోళానికి అసలు కారణం కొత్త నిబంధనల (FDTL) ప్రకారం పైలట్లకు ఇవ్వాల్సిన విశ్రాంతి ఇవ్వకుండా, డిమాండ్ కు తగ్గ సిబ్బందిని నియమించుకోకుండా లాభాల కోసం కక్కుర్తి పడటమే ఈ సంక్షోభానికి అసలు కారణం అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రయాణికుల సౌకర్యం కంటే తమ బిజినెస్ మార్జిన్లకే ఇండిగో పెద్దపీట వేసింది.

ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇండిగో వింటర్ షెడ్యూల్ లో 10 శాతం కోత విధించింది. ప్రయాణికుల సేఫ్టీ, టైం కంటే తమ బిజినెస్ ముఖ్యమని భావించిన ఇండిగోకు ఇది గట్టి ఎదురుదెబ్బే. జనం నమ్మకాన్ని మళ్ళీ గెలవాలంటే కూపన్లు పంచితే సరిపోదు, సర్వీస్ లో క్వాలిటీ మార్చాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

Kumar

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

12 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago