Trends

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఎయిర్ పోర్టుల్లో నరకం చూసిన వారికి సారీ చెబుతూ, పది వేల రూపాయల ట్రావెల్ వోచర్లు ఇస్తామని ప్రకటించింది. కస్టమర్స్ కోపాన్ని ఈ కూపన్లతో తగ్గించే ఈ ప్రయత్నంపై సోషల్ మీడియాలో రకారకరాల కామెంట్స్ వెలువడుతున్నాయి.

ఈ ఆఫర్ ప్రకారం, బాగా ఇబ్బంది పడ్డ ప్యాసింజర్లు ఈ పది వేల వోచర్‌ను వచ్చే ఏడాదిలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇది టికెట్ రీఫండ్ కు అదనం అని సంస్థ చెబుతోంది. అయితే ఇక్కడో మెలిక ఉంది. ‘తీవ్రంగా ప్రభావితమైన’ వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. అంటే ఎవరు అర్హులు, ఎవరు కాదు అనేది ఇండిగోనే డిసైడ్ చేస్తుందన్నమాట. ఇది మరో పెద్ద కాంట్రవర్సి అయ్యే అవకాశం ఉంది.

అసలు ప్రశ్న ఏంటంటే.. ఈ పది వేలు నిజంగా సరిపోతుందా? ఆ ప్రయాణం నమ్ముకుని మిస్ అయిన పెళ్లిళ్లు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, పరీక్షల విలువను ఈ వోచర్లు భర్తీ చేయగలవా? అర్జంట్‌గా వేరే ఫ్లైట్‌లో వెళ్లడానికి జనం తడిసి మోపెడయ్యేలా ఖర్చు చేశారు. ఆ మానసిక వేదన ముందు ఈ వోచర్లు కేవలం కంటితుడుపు చర్యలాగే కనిపిస్తున్నాయి.

ఈ గందరగోళానికి అసలు కారణం కొత్త నిబంధనల (FDTL) ప్రకారం పైలట్లకు ఇవ్వాల్సిన విశ్రాంతి ఇవ్వకుండా, డిమాండ్ కు తగ్గ సిబ్బందిని నియమించుకోకుండా లాభాల కోసం కక్కుర్తి పడటమే ఈ సంక్షోభానికి అసలు కారణం అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రయాణికుల సౌకర్యం కంటే తమ బిజినెస్ మార్జిన్లకే ఇండిగో పెద్దపీట వేసింది.

ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇండిగో వింటర్ షెడ్యూల్ లో 10 శాతం కోత విధించింది. ప్రయాణికుల సేఫ్టీ, టైం కంటే తమ బిజినెస్ ముఖ్యమని భావించిన ఇండిగోకు ఇది గట్టి ఎదురుదెబ్బే. జనం నమ్మకాన్ని మళ్ళీ గెలవాలంటే కూపన్లు పంచితే సరిపోదు, సర్వీస్ లో క్వాలిటీ మార్చాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

This post was last modified on December 11, 2025 5:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

6 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

7 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

7 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

7 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

10 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

12 hours ago