ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఎయిర్ పోర్టుల్లో నరకం చూసిన వారికి సారీ చెబుతూ, పది వేల రూపాయల ట్రావెల్ వోచర్లు ఇస్తామని ప్రకటించింది. కస్టమర్స్ కోపాన్ని ఈ కూపన్లతో తగ్గించే ఈ ప్రయత్నంపై సోషల్ మీడియాలో రకారకరాల కామెంట్స్ వెలువడుతున్నాయి.
ఈ ఆఫర్ ప్రకారం, బాగా ఇబ్బంది పడ్డ ప్యాసింజర్లు ఈ పది వేల వోచర్ను వచ్చే ఏడాదిలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇది టికెట్ రీఫండ్ కు అదనం అని సంస్థ చెబుతోంది. అయితే ఇక్కడో మెలిక ఉంది. ‘తీవ్రంగా ప్రభావితమైన’ వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. అంటే ఎవరు అర్హులు, ఎవరు కాదు అనేది ఇండిగోనే డిసైడ్ చేస్తుందన్నమాట. ఇది మరో పెద్ద కాంట్రవర్సి అయ్యే అవకాశం ఉంది.
అసలు ప్రశ్న ఏంటంటే.. ఈ పది వేలు నిజంగా సరిపోతుందా? ఆ ప్రయాణం నమ్ముకుని మిస్ అయిన పెళ్లిళ్లు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, పరీక్షల విలువను ఈ వోచర్లు భర్తీ చేయగలవా? అర్జంట్గా వేరే ఫ్లైట్లో వెళ్లడానికి జనం తడిసి మోపెడయ్యేలా ఖర్చు చేశారు. ఆ మానసిక వేదన ముందు ఈ వోచర్లు కేవలం కంటితుడుపు చర్యలాగే కనిపిస్తున్నాయి.
ఈ గందరగోళానికి అసలు కారణం కొత్త నిబంధనల (FDTL) ప్రకారం పైలట్లకు ఇవ్వాల్సిన విశ్రాంతి ఇవ్వకుండా, డిమాండ్ కు తగ్గ సిబ్బందిని నియమించుకోకుండా లాభాల కోసం కక్కుర్తి పడటమే ఈ సంక్షోభానికి అసలు కారణం అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రయాణికుల సౌకర్యం కంటే తమ బిజినెస్ మార్జిన్లకే ఇండిగో పెద్దపీట వేసింది.
ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇండిగో వింటర్ షెడ్యూల్ లో 10 శాతం కోత విధించింది. ప్రయాణికుల సేఫ్టీ, టైం కంటే తమ బిజినెస్ ముఖ్యమని భావించిన ఇండిగోకు ఇది గట్టి ఎదురుదెబ్బే. జనం నమ్మకాన్ని మళ్ళీ గెలవాలంటే కూపన్లు పంచితే సరిపోదు, సర్వీస్ లో క్వాలిటీ మార్చాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
This post was last modified on December 11, 2025 5:10 pm
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…