Trends

గోవా ప్రమాదం.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?

గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని ‘బర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్ క్లబ్ మాత్రం 25 మందికి మరణ శాసనం రాసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బంది సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇప్పుడు గోవా సేఫ్టీ ప్రోటోకాల్స్ మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

తాటాకులే యమపాశాలు
సరదాగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ క్లబ్ లోపల అలంకరణ కోసం వాడిన తాటాకులు క్షణాల్లో మంటలను వ్యాపింపజేశాయి. సిలిండర్ పేలుడు వల్లే ఇది జరిగిందని పోలీసులు చెబుతుంటే, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మంటలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కారణం ఏదైనా, క్షణాల్లో క్లబ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది.

అసలే ఇరుకైన ఎంట్రీ, ఎగ్జిట్ ఉండటంతో జనం భయంతో పరుగులు తీశారు. దారి తెలియక కొందరు గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్ వైపు వెళ్లి అక్కడే ఇరుక్కుపోయారు. క్లబ్ వెనుక జలాశయాలు ఉండటం, దారి చిన్నగా ఉండటంతో ఫైర్ ఇంజన్లు కూడా 400 మీటర్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పొగ కారణంగానే ఎక్కువమంది ఊపిరాడక చనిపోయారు.

అసలు ఆ క్లబ్ నిర్మాణం అక్రమమని తేలింది. దీనికి ఎలాంటి కన్‌స్ట్రక్షన్ లైసెన్స్ లేదని, గతంలోనే కూల్చివేత నోటీసులు ఇచ్చినా స్టే తెచ్చుకుని నడుపుతున్నారని సర్పంచ్ రోషన్ రెడ్కర్ చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించే ప్రాంతంలో  నిబంధనలకు విరుద్ధంగా దీన్ని కట్టారు. ప్రభుత్వం ఈ ఘటనపై మెజిస్టీరియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని 2 లక్షల పరిహారం ప్రకటించారు. క్లబ్ యజమానులు, మేనేజర్లపై కేసులు నమోదు చేశారు.

This post was last modified on December 7, 2025 1:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

59 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago