Trends

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు. అందుకే ఓ దుకాణం యజమాని తెలుగు లో కూడా బోర్డు పెట్టారు. అక్కడి దుకాణానికి ఉన్న తెలుగు అక్షరాలను తొలగించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. బళ్లారిలో ఆకృతి అనే తెలుగు అక్షరాలను తొలగించడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

కర్ణాటక రక్షణ వేదిక, బళ్లారి, విజయనగర జిల్లా అధ్యక్షుడు జి.రాజశేఖర్‌ రాజన్న ఆధ్వర్యంలో సైన్ బోర్డు నుంచి తొలగించారు. అయితే దానిపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కన్నడిగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కర్ణాటకలో సైన్బోర్డులపై 60 శాతం కన్నడ అక్షరాలు కనపడాలనే ఉత్తర్వులు ఉన్నాయని వారు చెబుతున్నారు. బళ్లారిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 42 శాతం కన్నడ మాట్లాడేవారు, 25 శాతం తెలుగు మాట్లాడేవారు, 24 శాతం ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు.

అయితే తెలుగు వాళ్లు దీనిని ఖండిస్తున్నారు. ఏపీలోని పలు పట్టణాల్లో కన్నడ బోర్డులు ఉండడాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు. అనంతపురం, ఆదోనిలోని దుకాణాలపై ఉన్న కన్నడ బోర్డులను, అదే విధంగా తిరుపతి, మంత్రాలయం వద్ద కన్నడ భాషలో ఉన్న అక్షరాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు అన్ని భాషలను అక్కున చేర్చుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాల్లో అవమాన పడాల్సి వస్తోందని వాపోతున్నారు.

కొద్దిరోజుల కిందట కన్నడ భాషపై నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. ఆయన సినిమాను బ్యాన్ చేస్తామంటూ రోడ్డెక్కారు. కోర్టు జోక్యంతో ఆ వివాదం సమసిపోయింది. ఇప్పడు తాజాగా బోర్డుపై తెలుగు పదాలను తొలగించడంతో తెలుగు రాష్ట్రాలలో మళ్లీ చర్చ మొదలైంది. 

This post was last modified on December 6, 2025 2:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

56 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago