Shot of a young businessman experiencing stress during a late night at work
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక గానీ అసలు నిజం తెలియదు. డబ్బులు వస్తాయి కానీ మనశ్శాంతి ఉండదని చాలామంది ఫీల్ అవుతుంటారు. సరిగ్గా ఇలాగే, కెనడాలో ఐదేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఓ ఎన్నారై, అక్కడి యాంత్రిక జీవనానికి విసిగిపోయి జాబ్కి రిజైన్ చేసి ఇండియా వచ్చేస్తున్నాడు. “ఇక నా వల్ల కాదు, ఆ రోబో లైఫ్ భరించలేను” అంటూ సోషల్ మీడియాలో (Reddit) పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
కెనడాలో జీవితం పైకి చూడటానికి బాగున్నా, లోపల మాత్రం చాలా “రోబోటిక్”గా ఉంటుందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ స్నేహితులు ఉన్నా కూడా, ఏదో తెలియని సోషల్ ఐసోలేషన్ వేధిస్తోందట. ప్రతి చిన్న పనికి ప్లానింగ్ అవసరమే. ఉదాహరణకు, బియ్యం కొనాలంటే కూడా కాస్ట్కోకి వెళ్లాలి, దానికి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. మన దగ్గరలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లే స్వేచ్ఛ లేకపోవడంతో తాను మనిషిలా ఫీల్ అవ్వలేకపోతున్నానని చెప్పాడు.
ఇండియాలో ఉండే “ఆర్గనైజ్డ్ ఖాయోస్” ను తాను బాగా మిస్ అవుతున్నట్లు రాసుకొచ్చాడు. మన దేశంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెండ్స్ని కలవచ్చు, సడెన్ ప్లాన్స్ వేసుకోవచ్చు. దీనివల్ల రోజంతా వృథా అవ్వదు. కానీ విదేశాల్లో ఆ పరిస్థితి లేదు. ఈ స్వేచ్ఛ లేని స్ట్రక్చర్డ్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే, జాబ్ మానేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిపాడు.
అంతేకాదు, అక్కడ డేటింగ్ లైఫ్ కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకొచ్చాడు. భయంకరమైన చలికాలంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతారని, కొత్తవాళ్లను కలవడం కష్టమని చెప్పాడు. ఇండియాలో దుమ్ము, ధూళి, సివిక్ సెన్స్ తక్కువని కొందరు విమర్శించినా పర్లేదు.. ఎన్ని లోపాలున్నా అది “మన ఇల్లు” అని ఎమోషనల్ అయ్యాడు.
ఇతని నిర్ణయం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడంతో పాటు మద్దతు కూడా ఇస్తున్నారు. “నీ సంతోషం ఎక్కడుంటే అక్కడే ఉండు, ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకున్నావ్” అని అభినందిస్తున్నారు. డబ్బు కంటే మనశ్శాంతి, సొంత మనుషుల మధ్య ఉండటమే ముఖ్యమని ఈ ఎన్నారై స్టోరీ మరోసారి నిరూపించింది. “ఫాలో యువర్ హార్ట్” అనే కామెంట్స్ ఇప్పుడు ఈ పోస్ట్ కింద వెల్లువలా వస్తున్నాయి.
This post was last modified on December 5, 2025 2:39 pm
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…